News April 5, 2024
కాంగ్రెస్ నుంచి చీరాల బరిలో ఆమంచి..?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1712290262711-normal-WIFI.webp)
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ నియోజకవర్గంలో క్రియాశీలక పాత్రను పోషించారు. వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎక్కడి నుంచి బరిలో నిలిచిన పోటాపోటీ తప్పదని పలువురు భావిస్తున్నారు.
Similar News
News January 19, 2025
ప్రకాశం: సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737269637547_52019922-normal-WIFI.webp)
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా నిర్వహింనున్నట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. గత సోమవారం భోగి పండుగ సందర్భంగా “గ్రీవెన్స్ డే” ను తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారుల కోసం సోమవారం అధికారులు కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.
News January 19, 2025
ప్రకాశం: నడుస్తూనే మృత్యు ఒడిలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737256592813_1271-normal-WIFI.webp)
రోడ్డుపై తమ పనుల నిమిత్తం కాలిబాట పట్టిన ముగ్గురు వ్యక్తులు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. మార్టూరు మండలం ఇసుక దర్శి గ్రామ సమీపంలో నాగిరెడ్డి నడుస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలో ప్రసన్నకుమార్ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. కొనకనమిట్ల మండలం చౌటపల్లి వద్ద నాగయ్యను ట్రాలీ ఆటో ఢీ కొనడంతో మృతి చెందాడు.
News January 19, 2025
పాకలలో నలుగురు మృతి.. అసలు కారణం ఇదే.!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737246509337_20611727-normal-WIFI.webp)
పాకల బీచ్లో 2 రోజుల క్రితం సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. పాకల బీచ్లో ఉన్న చిన్నచిన్న గుంతల కారణంగా కడ్సలు (సుడిగుండాలు) ఏర్పడుతాయని, వీటిలో చిక్కుకున్న వారు బ్రతకడం కష్టమని మత్స్యకారులు తెలిపారు. శివన్నపాలెం గ్రామానికి చెందిన నవ్య సమయస్ఫూర్తితో వ్యవహరించి కడ్సల బారి నుంచి తప్పించుకుందని వారు తెలిపారు.