News July 17, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద రైతులపై దాడులు: హరీశ్రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యంగా భూమిని లాక్కుంటున్నారని ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్న ధమక్కపల్లి కిష్టయ్యను పరామర్శించారు. కాంగ్రెస్ ఇష్ట రాజ్యాంగ పేద రైతుల భూముల మీద దాడులు చేస్తున్నారని అన్నారు.
Similar News
News January 4, 2026
మెదక్: ‘ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి రాహుల్ రాజ్, ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
News January 3, 2026
నర్సాపూర్లో టెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాలలోని టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సందర్శించారు. జిల్లాలో 200 మంది అభ్యర్థులకు గాను 95 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మొదటి పేపర్కు 65 మంది, రెండో పేపర్కు 40 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 3, 2026
మనోహరాబాద్: ‘Way2News’ ఎఫెక్ట్.. గేట్ తొలగింపు

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారు పల్లె చెరువు బఫర్ జోన్ స్థలానికి ప్రైవేట్ సీడ్ కంపెనీ ఏర్పాటు చేసిన గేటు తొలగించారు. గత నెల 31న ‘<<18725684>>Way2News<<>>’లో పల్లె చెరువు బఫర్ జోన్కు గేటు, ఆందోళన అంటూ కథనం ప్రచురితమైంది. 2న అధికారులు సందర్శించి గేటు తొలగించాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ ఆదేశాల మేరకు కంపెనీ యాజమాన్యం ఈరోజు బఫర్ జోన్ స్థలానికి ఏర్పాటుచేసిన గేటు తొలగించింది.


