News October 2, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం

image

ముస్లిం మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ ముస్లిం జేఏసీ నేతలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములను, ఈద్గా, ఖబ్రస్థాన్ భూములను గుర్తించి, రెవెన్యూ, వక్ఫ్ బోర్డు అధికారుల సమిష్టిగా వాటిని ప్రభుత్వపరంగా పరిరక్షించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Similar News

News October 24, 2025

జిల్లా జైలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్

image

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేష్ జిల్లా కారాగారాన్ని సందర్శించి, ఖైదీలకు అందుతున్న సేవలను తనిఖీ చేశారు. విచారణ ఖైదీలు జిల్లా కారాగారాన్ని ఒక పరివర్తన కేంద్రంగా భావించాలని, కారాగారంలో గడిపిన కాలంలో సత్ప్రవర్తనతో మెలిగి బయటకు వెళ్లిన తర్వాత క్షణికావేశాలకు లోనుకాకుండా ఉండాలని తెలియజేశారు.

News October 24, 2025

KNR: విద్యార్థులకు పోలీసు భద్రతా అవగాహన

image

పోలీసు అమర వీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, డిపార్టుమెంట్‌లో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పద్దతులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిరు.

News October 24, 2025

KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

image

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్‌పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.