News September 8, 2024

కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కాకినాడ జిల్లా వాసి

image

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావు పేటకు చెందిన నక్క సత్యనారాయణ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌లో ఉండి సామాన్య కార్యకర్తగా సేవలు అందించానన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

Similar News

News November 26, 2025

రాజమండ్రి: గోదావరి పుష్కరాలపై ఎంపీ దగ్గుబాటి కీలక ఆదేశాలు

image

గోదావరి పుష్కరాల దృష్ట్యా ఎన్‌హెచ్–365బీబీ అప్‌గ్రేడేషన్ పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి ఆదేశించారు. బుధవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్ట్ పురోగతి, భూ సేకరణ, క్లియరెన్సులు, నిర్మాణ సంస్థల పనితీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

News November 26, 2025

రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

image

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్‌లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.

News November 26, 2025

రాజమండ్రి: మాక్ అసెంబ్లీ విజేతలకు కలెక్టర్ అభినందన

image

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.