News July 11, 2024
కాంగ్రెస్ సర్కార్ మేల్కొనకపోతే దేశానికే నష్టం: KTR

TG: కాంగ్రెస్ పాలనలో HYDలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని పలు పత్రికా కథనాలను ఉటంకిస్తూ KTR ట్వీట్ చేశారు. నగరంలో వరుస హత్యలు పెరిగిపోతున్నాయని, అంతర్రాష్ట్ర ముఠాలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులు తరలిపోవడంతో ఉపాధి దెబ్బతింటోందని, నగర ప్రగతికి బ్రేకులు వేస్తే ఎలా అని ప్రశ్నల వర్షం కురిపించారు. సర్కారు మేల్కొనకపోతే HYD ప్రతిష్ఠ దెబ్బతింటుందని, అది రాష్ట్రానికే కాదు దేశానికీ నష్టమన్నారు.
Similar News
News October 21, 2025
మురిపించని ‘మూరత్’.. ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు!

దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ సెషన్ పెద్దగా మురిపించలేదు. మొదట లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 63 పాయింట్ల స్వల్ప లాభంతో 84,426 వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 25,868 వద్ద ముగిశాయి. నిఫ్టీలో సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ట్రేడ్ అవగా, కొటక్ మహీంద్రా, ICICI బ్యాంకులు, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.
News October 21, 2025
భార్యకు దూరంగా సెహ్వాగ్!

మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన దీపావళి పోస్టులో భార్య కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తల్లి, పిల్లలతో ఉన్న ఫొటోనే వీరూ షేర్ చేశారు. ఆయన భార్య ఆర్తి సైతం పిల్లలతో దిగిన ఫొటోనే పంచుకున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారని, సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకున్నారని నేషనల్ మీడియా తెలిపింది. దీంతో విడాకుల రూమర్స్ పెరిగాయి. సెహ్వాగ్ చివరిసారిగా 2023 ఆగస్టులో భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
News October 21, 2025
23న జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లిలోని కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 23న జాబ్ మేళా జరగనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీలో పాసైన 18-35 ఏళ్ల యువకులు అర్హులు. 18 కంపెనీలలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.