News February 21, 2025
కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్పూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.
Similar News
News September 17, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 22 నుంచి జరుగనున్న ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంటర్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News September 17, 2025
HYDలో తొలిసారి జాతీయ జెండా ఎగిరిందిక్కడే

దేశవ్యాప్తంగా 1947 AUG 15 నుంచి జాతీయ జెండాలు స్వేచ్ఛగా రెపరెపలాడుతున్న సమయంలో నిజాం ప్రభుత్వం నిరంకుశత్వంలో HYDలో ఎగరనివ్వలేదు. ఏడాది తర్వాత వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా 1948 SEP 17న తొలిసారిగా సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జాతీయ జెండా అధికారికంగా రెపరెపలాడి హైదారబాదీల స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చింది. అప్పుడు నిర్మించిన జెండా దిమ్మెను నేటికీ ప్రదర్శనకు అలాగే ఉంచారు.
News September 17, 2025
తిరుపతిలో బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి మృతి

తిరుపతి నగరంలో విషాదం నెలకొంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురంలో బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి చనిపోయాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన స్టీఫెన్గా గుర్తించారు. అంబేడ్కర్ లా కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడిపోయాడా? అనేది తెలియాల్సి ఉంది.