News February 21, 2025

కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

image

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.

Similar News

News February 23, 2026

రోజంతా కూర్చుంటున్నారా? ఎక్సర్‌సైజ్ చేసినా వేస్ట్!

image

గంటల తరబడి కదలకుండా కూర్చోవడం ప్రాణాంతకమని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రోజుకు 8గంటల కంటే ఎక్కువ కూర్చుంటే గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ముప్పు 20% పెరుగుతుంది. ఉదయాన్నే ఎక్సర్‌సైజ్ చేసినా, రోజంతా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని అది భర్తీ చేయలేదు. దీనివల్ల బ్లడ్ ఫ్లో మందగించి కొవ్వు పేరుకుపోతుంది. ప్రతి 30నిమిషాలకోసారి సీటు నుంచి లేచి కాసేపు నడవడం లేదా స్ట్రెచింగ్ చేస్తే రిస్క్ తగ్గుతుంది.

News February 23, 2026

నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

image

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్‌గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.

News February 23, 2026

ఏలూరు: ఇంటర్ విద్యార్థులకు SP తీపికబురు

image

ఇంటర్ విద్యార్థులకు SP ప్రతాప్ శివ కిషోర్ తీపి కబురు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంటే ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలీసు వాహనాలు పరీక్షా కేంద్రానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.