News February 21, 2025
కాకతీయ రాజు పెళ్లి ఉత్సవాలు.. హాజరైన ఓరుగల్లు బీజేపీ నేతలు

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయ రుద్రమదేవి వారసుడు రాజా కమల్ చంద్ర బాంజ్ దేవ్ మహారాజ్ వివాహ వేడుకలు జగదల్పూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ రాజవంశ యువరాణితో గురువారం పెళ్లి జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రముఖులు హాజరయ్యారు. ఓరుగల్లు నుంచి బీజేపీ నేతలు నాంపల్లి శ్రీనివాస్, పూసల శ్రీమాన్, శ్రీనివాస్, శ్రీహరితో పాటు మరికొందరు హాజరయ్యారు.
Similar News
News October 29, 2025
రేపటి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్స్ రీ ఓపెన్.. కానీ కండిషన్స్ అప్లై!

తుఫాన్ ప్రభావం లేని, పునరావాస కేంద్రాలుగా ఉపయోగించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ నెల 30వ తేదీ నుంచి రీఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. అయితే, పాఠశాల భవనాలు సురక్షితమని అధికారులు ధ్రువీకరించిన తర్వాతే తెరవాలని సూచించారు. ప్రతి పాఠశాల ప్రాంగణంలో, తరగతి గదుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ను కలెక్టర్ ఆదేశించారు.
News October 29, 2025
తుఫాను ప్రభావిత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలి: కలెక్టర్

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు సకాలంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, వ్యవసాయం, మత్స్య, పౌరసరఫరాల శాఖల అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సహాయం పంపిణీ, తుఫాను నష్ట గణనపై అధికారులతో చర్చించారు.
News October 29, 2025
అలా అయితే బంగ్లాదేశ్కు వెళ్తా: షేక్ హసీనా

భారత్లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్కు మెయిల్లో తెలిపారు. అవామీ లీగ్కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.


