News April 7, 2025

కాకాణికి ఊరట లభించేనా..?

image

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరగ్గా నేడు మరోమారు హైకోర్టులో కాకాణి బెయిల్‌పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు కాకాణి ఎక్కడున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Similar News

News November 18, 2025

తోటపల్లి: ఇంటిని లాక్కొని బెదిరిస్తున్నారని ఫిర్యాదు.!

image

నల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన తన ఇంటిని లాక్కొని అల్లుడు బెదిరిస్తున్నారని వృద్ధుడు సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తన పెద్ద అల్లుడు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళంవేసి, ఇంటి నుంచి తరిమేసి చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. తనకు మగ పిల్లలులేరని, ఇద్దరు ఆడపిల్లలని, భార్య చనిపోయారని, విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.

News November 18, 2025

తోటపల్లి: ఇంటిని లాక్కొని బెదిరిస్తున్నారని ఫిర్యాదు.!

image

నల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన తన ఇంటిని లాక్కొని అల్లుడు బెదిరిస్తున్నారని వృద్ధుడు సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తన పెద్ద అల్లుడు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళంవేసి, ఇంటి నుంచి తరిమేసి చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. తనకు మగ పిల్లలులేరని, ఇద్దరు ఆడపిల్లలని, భార్య చనిపోయారని, విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.

News November 17, 2025

నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

image

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.