News April 7, 2025
కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు

హై కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. క్వార్జ్ మైనింగ్ కేసులో నమోదైన కేసు నుంచి ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది.
Similar News
News December 30, 2025
టాప్-2లో నెల్లూరు జిల్లా

పునర్విభజన తర్వాత నెల్లూరు జిల్లా జనాభా తగ్గింది. గతంలో 4 డివిజన్లు, 38 మండలాలు, 24, 69,707 మంది జనాభాతో జిల్లా ఉండేది. తాజా మార్పులతో మండలాల సంఖ్య 36కు తగ్గింది. జనాభా సైతం 22,99, 699కి పడిపోయింది. అయినప్పటికీ జనాభా, మండలాల పరంగా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. జనాభా పరంగా తిరుపతి, మండలాల పరంగా కడప(41) టాప్లో ఉన్నాయి.
News December 30, 2025
నెల్లూరు జిల్లాలో డివిజన్లు ఇలా..!

➤నెల్లూరు(12): సైదాపురం, రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీ గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, నెల్లూరు సిటీ, రూరల్
➤కావలి(12): వీకే పాడు, కొండాపురం, వింజమూరు, కొడవలూరు, విడవలూరు, దుత్తలూరు, కలిగిరి, జలదంకి, దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి
➤ఆత్మకూరు(9): కలువాయి, చేజర్ల, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, ASపేట, ఉదయగిరి, సీతారామపురం
➤గూడూరు(3): కోట, చిల్లకూరు, గూడూరు
News December 30, 2025
కొత్తగా నెల్లూరు జిల్లా ఇలా..!

☞ డివిజన్లు: 4(నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు)
☞ మండలాలు: 36
☞ జనాభా: 22,99,699
☞ నియోజకవర్గాలు: 8
☞ కందుకూరును ప్రకాశంలో కలపడంతో ఆ డివిజన్లోని కొండాపురం, వరికుంటపాడు మండలాలు కావలి డివిజన్లోకి చేరాయి. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురాన్ని నెల్లూరు డివిజన్లో విలీనం చేశారు. 3మండలాలతోనే గూడూరు(కోట, వాకాడు, గూడూరు) డివిజన్ ఉంటుంది.


