News April 15, 2025

కాకినాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

image

కాకినాడ జిల్లా పరిషత్ కేంద్రం పూర్తిగా ఆక్రమణలకు గురైంది. ఈ ఆక్రమణలపై స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం ట్రాఫిక్ సీఐ నూని రమేష్ స్పందించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి మొత్తం ఆక్రమణలు తొలగించారు. జిల్లా పరిషత్ వద్ద షాపులు బయట పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతున్న విషయాన్ని గుర్తించి వాటిని పూర్తిగా తీసివేశారు. మరోసారి ఆక్రమిస్తే జరిమానాలు విధిస్తామని సీఐ రమేష్ హెచ్చరించారు. 

Similar News

News April 19, 2025

గొల్లప్రోలు: జోడెడ్ల బండిపై జోడిగా పెళ్లికి

image

పెళ్లంటే వధూవరులు ఇద్దరు కారులో వెళ్లటం సహజమే. కానీ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెళ్లికుమార్తె, పెళ్లికొడుకు జోడెడ్ల బండిపై జోడిగా వచ్చిన ఫొటో వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో వివాహం చేసుకునే వారు గుర్రపు బండ్లపై ఊరేగింపుగా వస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అదే విధంగా గొల్లప్రోలుకి చెందిన దీపిక కాకినాడకు చెందిన సాయి మనోజ్‌లు వినూత్నంగా జోడెడ్ల బండిపై ఊరేగింపుగా కళ్యాణ మండపానికి వచ్చారు. 

News April 19, 2025

అనుకోకుండా బుల్లెట్ తగిలి ఇండియన్ స్టూడెంట్ స్పాట్ డెడ్

image

కెనడాలో జరిగిన కాల్పుల్లో ఓ భారత విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. హామిల్టన్‌లోని మొహాక్ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా ఒంటారియోలోని ఓ బస్టాప్ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో కారులో వచ్చిన ఓ వ్యక్తి మరో వాహనంలోని వ్యక్తిపై కాల్పులు జరిపాడు. కానీ ఓ బుల్లెట్ మిస్సై హర్‌సిమ్రత్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

News April 19, 2025

నాగర్‌కర్నూల్‌: నీ సీఎం కుర్చీ గుంజేస్తాం రేవంత్ రెడ్డి: తీన్మార్ మల్లన్న

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ చైతన్య సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. SLBCలో చనిపోయిన వారిలో ఏడుగురు బీసీలకు ఆయన నివాళులర్పించారు. మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు వెళ్తే ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని గుంజేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర బీసీ నాయకులు పాల్గొన్నారు. 

error: Content is protected !!