News February 1, 2025
కాకినాడలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ఉమ్మడి తూ.గో జిల్లా కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ఎం.ఆదిమూర్తి(65), ధనలక్ష్మి(60) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పిల్లలు విదేశాల్లో ఉంటుండగా ఇక్కడ వారిద్దరే ఉంటున్నారు. అనారోగ్య సమస్యలున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురై శుక్రవారం సాయంత్రం ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాలను వెలికితీయించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 6, 2025
పంచాయతీ పోరు.. ఖర్చుల లెక్క చెప్పకుంటే అనర్హత వేటు

TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ఫలితాల తర్వాత 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలను ECకి తప్పనిసరిగా సమర్పించాలి. లేదంటే అనర్హత వేటు పడుతుంది. వేటు పడితే మూడేళ్లపాటు ఏ ఎన్నికలో పోటీ చేయరాదు. గెలిచిన వారు లెక్కలు చెప్పకపోతే పదవి నుంచి తొలగిస్తారు. 5 వేలకు పైగా ఓటర్లు ఉన్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు ₹2.50L, వార్డ్ మెంబర్లు ₹50K వరకు ఖర్చు చేయవచ్చు
News December 6, 2025
త్రిసాయుధ దళాల సేవలు ప్రశంసనీయం: కలెక్టర్

త్రిసాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టర్ జి.రాజకుమారి తన వంతు విరాళాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. దేశ రక్షణలో త్రిసాయుధ దళాల త్యాగాలు, సేవలు సమానతరహా లేనివి అని, వారి కృషి దేశ ప్రజలకు ఎల్లప్పుడూ గర్వకారణమని పేర్కొన్నారు. మాజీ సైనికుల సేవలు దేశ భద్రతా వ్యవస్థలో అత్యంత కీలకమని ప్రత్యేకంగా అభినందించారు.
News December 6, 2025
రాజమండ్రి: ఉద్యోగిపై విద్యార్థుల దాడి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐఅండ్ పీఆర్ అధికారి శ్రీనివాస్పై శనివారం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రైవేట్ కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడు దీనిపై ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


