News February 4, 2025
కాకినాడ: అదృశ్యమైన బాలుడు రైలులో దొరికేశాడు

కాకినాడ మధురానగర్కు చెందిన సత్యసాయి సృగ్విన్ (16) సోమవారం తెల్లవారుజామున అదృశ్య మైనట్లు ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. కాగా ఈ బాలుడు విశాఖ వెళుతున్న ట్రైన్లో ఉండగా గుర్తించిన ఓ వ్యక్తి ఆ బాలుడిని గుర్తించి ఇంద్రపాలెం పోలీసులకు అప్పగించారు. దీంతో కథ సుఖంతమైంది. ఎస్ఐ, బాలుడి తల్లిదండ్రులు అతడిని అభినందించారు. ఆ బాలుడు అదృశ్యంపై ఎస్ఐ వీరబాబు విస్తృత ప్రచారం చేయడంతో అతడు దొరకాడు.
Similar News
News February 19, 2025
శుభ ముహూర్తం (బుధవారం, 19-02-2025)

తిథి: బహుళ సప్తమి
నక్షత్రం: విశాఖ ఉ.8.11 నుంచి
శుభసమయం: ఉ.9.04 నుంచి 9.28 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36- మ.12.24
వర్జ్యం: మ.2.25 నుంచి మ.4.11 వరకు
అమృత ఘడియలు: రా.12.58 నుంచి రా.2.44 వరకు
News February 19, 2025
వికారాబాద్: అభివృద్ధి లక్ష్యంగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్

నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 2025-26 నాబార్డ్ పొటెన్షియల్ లింక్ క్రెడిట్ ప్లాన్ను ఆవిష్కరించారు. ప్రాధాన్యతా విభాగంలో అందుబాటులో ఉన్న భౌతిక ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
News February 19, 2025
గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే అని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.