News August 12, 2024
కాకినాడ అబ్బాయిని మోసం చేసిన ఆరుగురు మహిళలు

కాకినాడ జిల్లాకేంద్రంలోని పెద్దమార్కెట్కు చెందిన టి.కృష్ణమోహన్ను పెళ్లిసంబంధం పేరిట ఆరుగురు మహిళలు కలిసి కొద్దిరోజుల క్రితం <<13794340>>మోసం <<>>చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై గతంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయగా ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ రోజు బాధితుడు కలెక్టరేట్లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలోనూ ఫిర్యాదుచేశాడు.
Similar News
News December 3, 2025
మోరంపూడి ఫ్లైఓవర్ కింద గుర్తుతెలియని వ్యక్తి మృతి

మోరంపూడి ఫ్లైఓవర్ కింద బుధవారం 30-35 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడని బొమ్మూరు పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతిచెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు బొమ్మూరు పోలీస్స్టేషన్ 94407 96533 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
News December 3, 2025
రాజమండ్రి కమిషనర్కు చంద్రబాబు అభినందన

కేంద్ర ప్రభుత్వం నుంచి ‘జల్ సంచాయ్-జన్ భాగీధారి’ అవార్డును అందుకున్న రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పర్యటనకు వచ్చిన ఆయన అవార్డును చూసి కమిషనర్ను ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేస్తే ఇలాంటి అవార్డులు మరెన్నో వస్తాయని ఆయన అన్నారు. సమిష్టి కృషివల్లే ఇలాంటి అవార్డులు సాధ్యమవుతాయన్నారు.
News December 3, 2025
రాజమండ్రి: నిర్మలా సీతారామన్కు MP పురంధేశ్వరి రిక్వెస్ట్!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, పంటకు సంబంధించిన పలు విషయాలను ఆమె వివరించారు. టొబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారానికి హామీ ఇచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు.


