News February 2, 2025
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరీ ఖాన్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలోకి వెళ్తే.. కాకినాడకు చెందిన మన్సూరీ ఖాన్ భార్య పిల్లలతో రెండేళ్ల క్రితం కడప వలస వెళ్లారు. ఆర్థిక సమస్యలతో హాస్టల్ గదిలోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలను బాగా చూసుకోమని భార్య ఫారియాకు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడు.
Similar News
News December 12, 2025
చిన్నస్వామిలో IPL మ్యాచ్లకు లైన్ క్లియర్!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ IPL మ్యాచ్లు నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జస్టిస్ డీకున్హా కమిషన్ సూచించిన భద్రతా సిఫార్సులు అమలు చేస్తే మ్యాచ్లకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించింది. తొక్కిసలాట ఘటన అనంతరం స్టేడియం భద్రతాపరంగా అనుకూలం కాదని నివేదిక తేల్చడంతో పెద్ద ఈవెంట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్టేడియం పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
News December 12, 2025
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు
News December 12, 2025
ప్రభుత్వ ఫార్మా బలోపేతానికి చర్యలేంటి?: ఎంపీ

దేశంలో ఫార్మా పీఎస్యూ (పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్) రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, ప్రస్తుత పీఎస్యూల ఆధునికీకరణ ప్రణాళికలేంటో లోక్సభలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. దీనికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.


