News February 2, 2025

కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరీ ఖాన్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలోకి వెళ్తే.. కాకినాడకు చెందిన మన్సూరీ ఖాన్ భార్య పిల్లలతో రెండేళ్ల క్రితం కడప వలస వెళ్లారు. ఆర్థిక సమస్యలతో హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలను బాగా చూసుకోమని భార్య ఫారియాకు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడు.

Similar News

News January 1, 2026

ఖమ్మం: సదరం సేవలపై సెర్ప్ సీఈవో సమీక్ష

image

సదరం అమలు, ధ్రువీకరణ పత్రాల జారీపై సెర్ప్ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. సీఈవో మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు సకాలంలో సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపుల నిర్వహణలో పారదర్శకత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

News January 1, 2026

ఫలితాలను సమీక్షించుకోవడం ముఖ్యం

image

దేన్నైనా సాధించాలి అనుకొనే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదురైతే చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. పట్టుదలను పెంచుకోవాలి. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయంటున్నారు నిపుణులు.

News January 1, 2026

నారాయణపేట: పుష్పగుచ్ఛాలు వద్దు.. పుస్తకాలివ్వండి- కలెక్టర్

image

నూతన సంవత్సర వేడుకలలో ఆడంబరాలకు స్వస్తి పలికి, సేవా దృక్పథాన్ని చాటాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. జనవరి 1న తనను కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ దుప్పట్లు తీసుకురావాలని బుధవారం విజ్ఞప్తి చేశారు. ఈ వస్తువులను సేకరించి త్వరలోనే అర్హులైన పిల్లలకు అందజేస్తామని ఆయన తెలిపారు.