News March 12, 2025

కాకినాడ: ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

image

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెగ్యులర్‌గా 22,579 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 21,694 మంది హాజరయ్యారు. 885 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్ అధికారి నూకరాజు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో 1,748 మందికి గాను 1,612 మంది హాజరయ్యారని, 136 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. అన్ని సెంటర్లలో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.

Similar News

News December 8, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్.. స్పెషల్ అట్రాక్షన్ ఇవే!

image

గ్లోబల్ సమ్మిట్‌లో 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్‌, LED లేజర్ లైటింగ్, ఎయిర్‌పోర్ట్ బ్రాండింగ్‌ ఆకట్టుకోనుంది. MM కీరవాణి లైవ్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పెరిని, బోనాలు, బంజారా, కొమ్ము కోయ, కోలాటం, గుస్సాడి వంటి తెలంగాణ జనపద కళలు సందడి చేస్తాయి. తెలంగాణ చిరుతిళ్లు, HYD బిర్యానీ అతిథులను రంజింపజేస్తాయి. పొచంపల్లి ఇక్కత్‌, చెరియల్ ఆర్ట్‌, అత్తర్‌, ముత్యాల ప్రదర్శనకు రానున్నాయి.

News December 8, 2025

విమానాల రద్దు.. ఇండిగో షేర్లు భారీగా పతనం

image

ఇండిగో(ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌) షేర్లు ఇవాళ ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. సెషన్ ప్రారంభంలో ఏకంగా 7 శాతం నష్టపోయాయి. తర్వాత కాస్త ఎగసినా మళ్లీ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం 406 పాయింట్లు కోల్పోయి(7.6 శాతం) 4,964 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గత 5 రోజుల్లో ఏకంగా 14 శాతం మేర నష్టపోయాయి. వారం రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు.

News December 8, 2025

వెంకటాపూర్: సర్పంచ్ పోరు.. ఇదే ప్రత్యేకత..!

image

మరికల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నుంచి విజయ్ కుమార్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఈ పంచాయతీ జనరల్‌కు కేటాయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయకుమార్ తల్లి కళావతమ్మ, బీఆర్‌ఎస్ నుంచి రాజేందర్ రెడ్డి తల్లి అనితలు పోటీ చేశారు. గత ఎన్నికల్లో కళావతమ్మ విజయం సాధించారు. మరి ఈ ఎన్నికల్లో ఎవ్వరిని విజయం వస్తుందో ఈనెల 14న తెలుస్తుంది.