News March 12, 2025
కాకినాడ: ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెగ్యులర్గా 22,579 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 21,694 మంది హాజరయ్యారు. 885 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్ అధికారి నూకరాజు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో 1,748 మందికి గాను 1,612 మంది హాజరయ్యారని, 136 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. అన్ని సెంటర్లలో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.
Similar News
News January 18, 2026
గర్భిణులు పారాసిటామాల్ వాడొచ్చు!

గర్భిణులు పారాసిటామాల్ ట్యాబ్లెట్ వాడొచ్చని లాన్సెట్ తాజా నివేదిక వెల్లడించింది. దీని వల్ల పుట్టే పిల్లలకు ఆటిజం రాదని, మెదడు ఎదుగుదలపై ఎఫెక్ట్ ఉండదని పేర్కొంది. స్వీడన్, జపాన్కు చెందిన 26లక్షల మంది పిల్లల డేటాను విశ్లేషించిన సైంటిస్టులు పారాసిటామాల్ వాడకంపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఈ ట్యాబ్లెట్ వల్ల పిల్లలకు ముప్పు అని SMలో ప్రచారం జరిగింది. అటు గర్భిణులకు ఉన్న అనుమానాలనూ ఈ నివేదిక తొలగించింది.
News January 18, 2026
చంద్ర దోష నివారణకు నేడు సువర్ణవకాశం..

అమావాస్య నాడు చంద్రకళలు క్షీణించి ఉంటాయి. అందుకే జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారికి మానసిక అశాంతి కలుగుతుంది. దీని నివారణకు చొల్లంగి అమావాస్య సరైన రోజని జ్యోతిషులు చెబుతున్నారు. ‘తెల్లని వస్త్రంలో బియ్యం, చిన్న వెండి చంద్రుని ప్రతిమను పెట్టి, తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సాయంత్రం వేళ ప్రవహించే నదీ జలాల్లో ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని, తెల్లని పూలను విడిచిపెట్టాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2026
NASA ఆఫర్.. మూడ్రోజులే ఛాన్స్

చంద్రుడిని చుట్టి వచ్చేందుకు NASA <<18861755>>ఆర్టెమిస్-2<<>> టెస్ట్ ఫ్లైట్ మిషన్ చేపట్టింది. ఇందులో ప్రజలను భాగం చేసేందుకు ‘సెండ్ యువర్ నేమ్’ క్యాంపైన్ రన్ చేస్తోంది. రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లను SD కార్డ్లో వేసి ఆస్ట్రోనాట్స్తో పాటు పంపుతారు. 10 రోజులపాటు మీ పేరు చంద్రుడిని చుట్టొస్తుంది. వారి పేరుతో బోర్డింగ్ పాస్ కూడా ఇస్తున్నారు. JAN 21తో ఈ క్యాంపైన్ ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకునేందుకు <


