News February 22, 2025

కాకినాడ: ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తరలింపు

image

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాకినాడలో మెక్లారిన్ హై స్కూల్, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఏలూరు కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి శుక్రవారం తెలిపారు. 26వ తేదీన ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఎన్నికల పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేస్తామన్నారు.

Similar News

News November 19, 2025

NLG: పత్తి కొనుగోళ్లు నత్తనడకే!..

image

ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 7.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అయినట్లు అంచనా. ఇందులో నుంచి సాధారణంగా అయితే 95 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 98,492 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా, కపాస్ కిసాన్ యాప్‌తో పాటు సీసీఐ నిబంధనలు రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి.

News November 19, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తఏరువారిపల్లి విద్యార్థిని ఎంపిక

image

సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన అండర్- 14 ఖోఖో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి హైస్కూల్ విద్యార్థిని హర్షవర్ధని సత్తా చాటి ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET అహ్మద్ చెప్పారు. హర్షవర్ధనికి ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటయ్య, గ్రామస్థులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని వారు కోరారు.

News November 19, 2025

NTRలో 1,18,629 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ

image

ఎన్టీఆర్ జిల్లాలో 1,18,629 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి మరికొద్ది సేపట్లో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ నిధులు జమ కానున్నాయి. మొత్తం రూ.79.72 కోట్లు ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తెలిపారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.59.31 కోట్లు కాగా, కేంద్రం నుంచి రూ.20.41 కోట్లు మంజూరు అవుతున్నట్లు స్పష్టం చేశారు.