News February 22, 2025
కాకినాడ: ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తరలింపు

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాకినాడలో మెక్లారిన్ హై స్కూల్, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఏలూరు కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి శుక్రవారం తెలిపారు. 26వ తేదీన ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఎన్నికల పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేస్తామన్నారు.
Similar News
News November 8, 2025
పావలా వడ్డీకే రుణాలు: తిరుపతి కలెక్టర్

KVBపురం(M)లో రాయల చెరువు తెగి ఐదు ఊర్లు నీట మునిగిన విషయం తెలిసిందే. వరద ధాటికి 57 మూగ జీవులు(26 ఆవులు, 18 గేదెలు, 13 గొర్రెలు) చనిపోయినట్లు సమాచారం. కొట్టుకుపోయిన జీవాలు కొన్ని ఇంటి బాట పట్టాయి. పశువులను కోల్పోయిన వారిని నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు డ్వాక్రా ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారన్నారు.
News November 8, 2025
కరీంనగర్ జిల్లా ప్రగతిపై గవర్నర్ సమీక్ష

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పవర్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా సమగ్ర స్వరూపాన్ని, కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరును గవర్నర్కు వివరించారు. పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 8, 2025
KNR: విద్యార్థులకు రాజ్యాంగ హక్కులపై అవగాహన

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవం సందర్భంగా KNR జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, వారి భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించి సవివరంగా వివరించారు.


