News February 22, 2025
కాకినాడ: ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు తరలింపు

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాకినాడలో మెక్లారిన్ హై స్కూల్, పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాలలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఏలూరు కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి శుక్రవారం తెలిపారు. 26వ తేదీన ఆయా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఎన్నికల పోలింగ్ సామాగ్రిని ఎన్నికల సిబ్బందికి అందజేస్తామన్నారు.
Similar News
News March 26, 2025
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన DWO సుధారాణి

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల వయసుకు తగిన బరువు, ఎత్తు ఉండాలని వనపర్తి సంక్షేమ అధికారిని సుధారాణి అన్నారు. బుధవారం వనపర్తిలోని బసవన్న గడ్డ అంగన్వాడీ సెంటర్ను ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ కొంతమంది చిన్నారులు పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేకపోవడంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, వారిని గుర్తించేందుకు జిల్లాలోని అన్నిఅంగన్వాడీ సెంటర్లలో ప్రతి బుధవారం గ్రోత్ మానిటరింగ్ చేయాలని సూచించారు.
News March 26, 2025
ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలి: చంద్రబాబు

సచివాలయంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పోలీసు శాఖ, శాంతిభద్రతలపై చర్చ జరిగింది. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీసు శాఖకు మంచి గుర్తింపు ఉందని, రాష్ట్రంలో జీరో క్రైమ్ లక్ష్యంగా పోలీసు శాఖ వినూత్న ప్రణాళికలతో కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు. ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పోలీసింగ్ ఉండాలన్నారు. ఆధునిక టెక్నాలజీ విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.
News March 26, 2025
Stock Markets: ₹4లక్షల కోట్లు ఆవిరి

స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 23,486 (-181), సెన్సెక్స్ 77,288 (-728) వద్ద ముగిశాయి. ₹4L CR మదుపరుల సంపద ఆవిరైంది. మీడియా, రియాల్టి, హెల్త్కేర్, చమురు, PSE, PSU బ్యాంకు, IT, ఫైనాన్స్, ఫార్మా, కమోడిటీస్, PVT బ్యాంకు, ఎనర్జీ షేర్లు విలవిల్లాడాయి. ఇండస్ఇండ్, ట్రెంట్, హీరోమోటో, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. NTPC, TECH M, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.