News February 27, 2025
కాకినాడ: ఐదుకు చేరిన జీబీఎస్ కేసులు

కాకినాడ జిల్లాను జీబీఎస్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో నాలుగు కేసులు ఉండగా బుధవారం ఇదే వైరస్తో మరో వ్యక్తి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఒకరు డిశ్చార్జి కాగా నలుగురు చికిత్స పొందుతున్నారు. గిలియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నవారు కాకినాడ జీజీహెచ్కు రావాలని సూపరిండెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కోరారు.
Similar News
News October 31, 2025
బాహుబలి యూనివర్స్లో కొత్త సినిమా ప్రకటన

బాహుబలి యూనివర్స్లో ‘బాహుబలి-ది ఎటర్నల్ వార్’ పేరిట 3D యానిమేటెడ్ మూవీ రాబోతోంది. ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా చివర్లో ఈ 3D మూవీ టీజర్ను థియేటర్లలో ప్లే చేశారు. 2027లో తొలి పార్ట్ రిలీజ్ కానుంది. కొత్త కథతో రూ.120కోట్ల బడ్జెట్తో దీనిని రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా తెరకెక్కించనున్నారు. ఇందులో ఇంద్రుడు, బాహుబలి మధ్య యుద్ధాన్ని చూపిస్తారని తెలుస్తోంది.
News October 31, 2025
₹39,216 కోట్ల ఒప్పందాలపై విశాఖ పోర్టు సంతకాలు

AP: ముంబైలో జరిగిన మారిటైమ్ వీక్-2025 సమావేశాల్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ(VPA) ₹39,216 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్&రిపేర్ క్లస్టర్ ఏర్పాటు కోసం AP ప్రభుత్వంతో ₹29,662 కోట్ల ఒప్పందం చేసుకుంది. మెకాన్ ఇండియాతో ₹3,000 కోట్లు, NBCCతో ₹500 కోట్లు, హడ్కోతో ₹487.38 కోట్లు, రైల్ వికాస్ నియమిటెడ్తో ₹535 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది.
News October 31, 2025
సిద్దిపేట: పేదింట్లో మెరిసిన ఆణిముత్యం

జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన దళిత బిడ్డ తప్పెట్ల సంధ్య హైడ్రో జియాలజిస్ట్గా ఎంపికయ్యారు. కూలి కుటుంబానికి చెందిన లక్ష్మి-సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె సంధ్య యూపీఎస్సీలో ఫలితాల్లో 29వ ర్యాంక్తో ప్రతిభ చాటింది. విద్య పేదరికం, పట్టుదల, కృషి, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చని సంధ్య నిరూపించింది. దీంతో ఆమెను గ్రామ ప్రజలు అభినందించారు.


