News March 16, 2025
కాకినాడ: కన్నతండ్రే కిల్లర్లా చంపేశాడు..!

కన్నతండ్రే కిల్లర్లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్రూమ్లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.
Similar News
News September 15, 2025
నక్కపల్లి: ధర్నా చేసిన పలువురిపై కేసులు నమోదు

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా ఆదివారం ధర్నాలో పాల్గొన్న 13 మంది మత్స్యకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.ఎ రిపల్లి నాగేశ్వరరావు, ఎం.మహేష్, ఎం.బైరాగి, జి.స్వామి, కె.కాశీరావు పి.రాము తదితరులపై పోలీసులు కేసులు పెట్టారు. ధర్నాకు అనుమతులు లేని కారణంగా కేసులు నమోదు చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు.
News September 15, 2025
హైదరాబాద్కు ‘మోక్షం’ ప్రసాదించారు

1908..HYD మరిచిపోలేని ఏడాది. మూసీలో భారీ వరదలు వేలమందిని బలిగొన్నాయి. మరోసారి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909లో ద్విముఖ వ్యూహం రచించారు. అదే మూసీ ప్రాజెక్ట్. వరదల నియంత్రణ, తాగునీటి కష్టాలు తీర్చేలా ట్వీన్ రిజర్వాయర్స్ ఆయన ఆలోచనల నుంచే పుట్టాయి. టెక్నాలజీ పెద్దగా లేనప్పుడే నేటికి చెక్కుచెదరని పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థ HYDకు అందించారు. నేడు ఆ మహాజ్ఞాని జయంతి సందర్భంగా స్మరించుకుందాం.
News September 15, 2025
కలెక్టర్ల కాన్ఫరెన్స్.. చర్చించే అంశాలు ఇవే

AP: ఇవాళ, రేపు సచివాలయంలో CM చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్లో వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, హౌసింగ్, సూపర్ సిక్స్ పథకాలు, పీ-4, అన్న క్యాంటీన్లు, సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టుల పురోగతిపై చర్చించనున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు విద్య, వైద్యం, రెవెన్యూ తదితర అంశాలపై చర్చ జరగనుంది.