News February 13, 2025

కాకినాడ: కన్నబాబుకు హైకమాండ్ కీలక బాధ్యతలు

image

మాజీ మంత్రి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు పార్టీ పదోన్నతి కల్పించింది. ఆయనను ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ గా నియమించింది. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఆయన స్థానంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు. కన్నబాబుకు కీలక పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు, జిల్లా వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 8, 2025

జిల్లాలో 100% ఓటింగే లక్ష్యం: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% ఓటింగ్ ఎలక్షన్ గా ప్రతి ఒకరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డు ఒకటే ప్రధానం కాదని, ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులను చూపి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. గత గ్రామపంచాయతీ ఎన్నికలలో 90.14 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఉన్నారు.

News December 8, 2025

ఎకరాల భూమి ఉన్నా.. అమ్మలేరు..!

image

ప్రత్తిపాడు మండలం చింతలూరులో దశాబ్దాలుగా భూములన్నీ ఈనాం పరిధిలో ఉండటంతో, భూ పట్టాలు లేక రైతులు భూమిని అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా గ్రామంలోని కొందరు పెత్తందారులు రైతులు పండించుకుంటున్న భూమిపై పన్నులు కూడా వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ ఈనాం సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News December 8, 2025

మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

image

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.