News January 26, 2025

కాకినాడ కలెక్టర్‌కు ఉత్తమ ఎన్నికల అధికారి పురస్కారం

image

కాకినాడ కలెక్టర్ ఎస్ ఎస్ మోహన్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా పురస్కారం అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ ఎన్నికల అధికారిగా ఆయన అవార్డు స్వీకరించారు. అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవలు అందిస్తామన్నారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, అర్బన్ తాహశీల్దార్‌లకు అవార్డులు దక్కాయి.

Similar News

News November 7, 2025

కల్వకుర్తిలో కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

image

ఈ నెల 9న కల్వకుర్తి మండలం మార్చాల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదయ్య తెలిపారు. 2006 తర్వాత జన్మించిన, 75 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.

News November 7, 2025

నరసరావుపేట: వన మహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన భోజనాలు నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. సహజ సౌందర్యం నడుమ అధికారులు ఆనందంగా గడిపారు.

News November 7, 2025

ఆసిఫాబాద్: ‘పెండింగ్ సమస్యలను పరిష్కరించండి’

image

గిరిజన ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు ఆసిఫాబాద్‌లో ఈరోజు ఏటీడీవో శివకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివ కృష్ణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.