News March 4, 2025

కాకినాడ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

Similar News

News December 10, 2025

ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి, ఊరుకొండ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సామగ్రి పంపిణీ విధానాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పరిశీలించారు. ఎన్నికల బృందాల హాజరు, పోలింగ్ మెటీరియల్ అందజేత, రవాణా వాహనాల సంసిద్ధతను సమీక్షించారు. పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

News December 10, 2025

కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

image

కడప నగర నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News December 10, 2025

క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

image

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.