News March 4, 2025

కాకినాడ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

Similar News

News December 13, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి.. జాగ్రత్తగా ఉండండి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.1, మల్చెల్మ 7.0, మెదక్ జిల్లా దామరంచ 8.2, వెల్దుర్తి 9.0, సిద్దిపేట జిల్లా తిప్పారం 8.3, పోతారెడ్డి పేట 8.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలోనమోదయ్యాయి. చలి తీవ్ర దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 13, 2025

వేములవాడలో దొంగ నోటు కలకలం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ నోటు కలకలం రేపింది. మహిళా స్వశక్తి సంఘం సభ్యురాలి వద్ద రూ.500 దొంగ నోటు లభించింది. గ్రూపు లీడర్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లిస్తుండగా, సిబ్బంది ఆ 500 రూపాయల దొంగ నోటును గుర్తించారు. సభ్యుల వద్ద సేకరించిన మొత్తంలోనే ఇది రావడం, ఈ ప్రాంతంలో దొంగ నోటు బయటపడటం ఇది 2వ సారి కావడంతో, నోటు ఎవరి వద్ద నుంచి వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

News December 13, 2025

పిఠాపురంలో ఘర్షణ.. కత్తితో దాడి

image

పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద వాహనం పార్కింగ్‌ వివాదం కత్తిపోట్లకు దారితీసింది. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి పెద్దాపురం నుంచి వచ్చిన ముగ్గురు భక్తులు కారు పార్క్ చేసే క్రమంలో మరో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఘర్షణ తీవ్రం కావడంతో అవతలి వ్యక్తి కత్తి, స్క్రూ డ్రైవర్‌తో భక్తులపై దాడికి తెగబడ్డాడని తెలిపారు. దీంతో తోటి భక్తులు భయాందోళనకు గురయ్యారు.