News March 4, 2025

కాకినాడ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

image

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.

Similar News

News December 21, 2025

హిందువులంతా ఐక్యంగా ఉండాలి.. బంగ్లా దాడులపై మోహన్ భాగవత్

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులనుద్దేశించి RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి హిందువులు ఐక్యంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. హిందువులకు భారతదేశమే ఏకైక ఆశ్రయమని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం తరఫున మరిన్ని గట్టి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.

News December 21, 2025

పాకిస్థాన్‌తో ఫైనల్.. టీమ్ ఇండియా ఓటమి

image

అండర్-19 ఆసియాకప్ ఫైనల్: పాకిస్థాన్‌తో మ్యాచులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం పాలైంది. సీజన్ మొత్తం అదరగొట్టిన ఆయుశ్ సేన కీలక మ్యాచులో చేతులెత్తేసింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 156 పరుగులకే ఆలౌటైంది. దీంతో 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. హిట్టర్ సూర్యవంశీ(26), జార్జ్(16), అభిజ్ఞాన్(13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివర్లో దీపేశ్ దేవేంద్రన్ (16 బంతుల్లో 36) దూకుడుగా ఆడారు.

News December 21, 2025

SSS: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

image

హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ వరలక్ష్మి తెలిపారు. ఈ నెల 22 నుంచి 30 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు పరిధిలో కార్యకర్త 1, 12 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీల భర్తీ పారదర్శకంగా చేపడతామన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.