News February 3, 2025
కాకినాడ: క్రీడా పోటీలు ప్రారంభం

గోదావరి టెన్నిస్ అసోసియేషన్, కాకినాడ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఛాంపియన్ షిప్ సిరీస్ – AITA అండర్ 16 పోటీలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పోటీలకు కావలసిన సహాయ సహకారాలు ఆయన అందిస్తానన్నారు.
Similar News
News February 22, 2026
సిరిసిల్ల: దివ్యాంగ విద్యార్థుల ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1-10 తరగతి దివ్యాంగ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 40 శాతానికి పైగా వైకల్యం ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు పత్రాలను కలెక్టరేట్లోని జి-33 గదిలో సమర్పించాలని సూచించారు.
News February 22, 2026
నేడు దేవాదుల ప్రాజెక్టుకు CM రేవంత్

TG: CM రేవంత్ రెడ్డి నేడు దేవాదుల ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష జరపనున్నారు. ములుగు జిల్లా తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్, దేవాదుల పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను అదనపు కలెక్టర్, SP, అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం సీఎం సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటి సరఫరా సామర్థ్యం, పెండింగ్ పనులు, నిర్వహణపై కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు.
News February 22, 2026
భూసేకరణ వేగవంతం చేయండి: కలెక్టర్

కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి, రైతుల ప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.


