News March 18, 2025
కాకినాడ: గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం

రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, బీసీ గృహాల లబ్ధిదారులకు అదనపు ఆర్దిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కాకినాడ జిల్లా హౌసింగ్ పీడీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో గృహాల నిర్మాణంలో లబ్ధిదారులకు అదనంగా నిధులు మంజూరైన పత్రాలు అందజేశారు. బీసీలకు రూ.50,000, ఎస్టీలకు రూ.75,000 ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. కావున లబ్ధిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News December 11, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➤SKLM: ధాన్యం కొనుగోలు కేంద్రంలో జేసీ ఆకస్మిక తనిఖీలు
➤టెక్కలి: మళ్లీ తెరుచుకున్న ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ
➤బూర్జ: దొంగతనం కేసులో ఐదుగురు అరెస్ట్
➤నరసన్నపేట: గంజాయితో పట్టుబడిన ముగ్గురు అరెస్ట్
➤క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే కూన
➤జిల్లా కేంద్రానికి చేరుకున్న వైసీపీ కోటి సంతకాల ప్రతులు
➤ వజ్రపుకొత్తూరు:76 వ అంతర పాఠశాలల పోటీలకు ఏర్పాట్లు
News December 11, 2025
మోదీకి నెతన్యాహు ఫోన్

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. గాజాలో శాంతి స్థాపనకు తమ సహకారం ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు.
News December 11, 2025
వేములవాడ: పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 76 సర్పంచ్, 519 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.


