News January 30, 2025

కాకినాడ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు, పేరును ఇప్పటికే ప్రకటించారు.

Similar News

News December 13, 2025

వంగలో కొమ్మ, కాయకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

image

శీతాకాలంలో వంగ పంటను కొమ్మ, కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. మొక్క నుంచి కాయ కోత వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ తెగులు సోకిన ఆకులపై గుండ్రని బూడిద, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల కాండం, కాయలు కుళ్లి రాలిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన మొక్క నుంచే విత్తనం సేకరించాలి. కాస్త వేడిగా ఉన్న నీటిలో విత్తనం నానబెట్టి విత్తుకోవాలి. తొలిదశలో లీటరు నీటికి మాంకోజెబ్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News December 13, 2025

కొత్తపేట: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

image

కొత్తపేట మండలం మద్దుల మెరకలో విషాదం చోటుచేసుకుంది. తాటి చెట్టుపై నుంచి పడి చుట్టుగుళ్ల ఏడుకొండలు (45) అనే గీత కార్మికుడు మృతి చెందాడు. శనివారం కల్లు గీసేందుకు చెట్టు ఎక్కిన ఆయన ప్రమాదవశాత్తు పట్టుతప్పి కింద పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.

News December 13, 2025

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

image

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కె‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.