News January 30, 2025
కాకినాడ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ, 27న ఉదయం 8.నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు, పేరును ఇప్పటికే ప్రకటించారు.
Similar News
News September 15, 2025
దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్

ఒడిశాలో ఓ హాస్టల్ విద్యార్థి చేసిన తుంటరి పని తోటి విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చింది. కంధమాల్ జిల్లా సలాగూడలోని సెబాశ్రమ్ స్కూల్ హాస్టల్లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో ఓ స్టూడెంట్ ఫెవిక్విక్ వేశాడు. ఈ ఘటనతో వారి కళ్లు మూసుకుపోయాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకరికి కళ్లు పూర్తిగా తెరుచుకోగా మిగతావారికి అలాగే ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
స్వధార్ హోమ్లో మహిళ ఆత్మహత్య: SI

విజయనగరంలోని BC కాలనీ మహిళా ప్రాంగణంలో ఉన్న స్వధార్ హోమ్లో భారతి (21) ఆత్మహత్య చేసుకుందని రూరల్ SI అశోక్ కుమార్ తెలిపారు. SI వివరాలు ప్రకారం.. అబూజా (17)ని భారతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొత్తవలసలోని ఓ చోరి కేసులో ఈ నెల 12న అబూజాని అరెస్ట్ చేసి బాల నేరస్థుల హోంకు తరలించారు. ప్రేమ వివాహం కారణంగా వీరిని కుటుంబ సభ్యులు దూరంగా ఉంచడంతో ఆమెను స్వధార్ హోమ్లో ఉంచారు. అక్కడ ఆమె అత్మహత్య చేసుకుంది.
News September 15, 2025
CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

<