News March 6, 2025
కాకినాడ : ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ఏలూరు గ్రామీణ మండలం సోమవరప్పాడు వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి కాకినాడ వస్తున్న బస్సు – లారీని ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2025
స్కూళ్లకు వేసవి సెలవులు.. తేదీ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. అయితే తెలంగాణలో APR 20, APలో APR 23 నుంచి సమ్మర్ హాలిడేస్ ఉంటాయని పలు కథనాలు వచ్చాయి. దీనిపై ఇరు రాష్ట్రాల విద్యాశాఖ వర్గాలను Way2News సంప్రదించింది. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం APR 23 చివరి పనిదినం అని వారి నుంచి సమాధానం వచ్చింది. ఎండల తీవ్రత వంటి కారణాలతో సెలవు తేదీల్లో మార్పులు ఉంటే ప్రకటన చేస్తామన్నాయి.
Share It
News March 6, 2025
ప్రపంచంలో బెస్ట్ టీమ్ ఇదేనట.. ఏమంటారు?

ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ క్రికెట్ టీమ్ ఏదంటే అందరూ చెప్పేది టీమ్ఇండియా పేరు. కానీ, ఆల్టైమ్ బెస్ట్ & డేంజరస్ క్రికెట్ టీమ్ మాత్రం ‘2003 ఆస్ట్రేలియన్’ జట్టు అని కొందరు చెబుతుంటారు. ఆసీస్ వరుసగా 1999, 2003, 2007 వరల్డ్ కప్స్ గెలిచింది. అప్పట్లో గిల్ క్రిస్ట్& మాథ్యూ ఓపెనింగ్ అదిరిపోయేదంటున్నారు. రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీలో ప్రత్యర్థులకు చుక్కలు కనపడేవని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 6, 2025
భారతి హత్య కేసులో తండ్రి, మరొకరి అరెస్ట్

గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో వద్ద జరిగిన పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి రామాంజనేయులు, బావ మారుతి కలిసి భారతి (21)ని హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆటోను సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కాగా కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో తండ్రి దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.