News March 7, 2025

కాకినాడ : చాలా ఘోరం కదా..?

image

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ)చనిపోయాడు.

Similar News

News December 15, 2025

భూపాలపల్లి: పాలకవర్గాలపై కోటి ఆశలు!

image

జిల్లాలో 248 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ నెల 17వ తేదీతో కొత్త సర్పంచులు ఎన్నిక పూర్తవుతుంది. 20వ తేదీ నుండి కొత్త పాలకవర్గం రానుంది. పాలకవర్గాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని నమ్మకంతో ప్రజలు ఉన్నారు కొత్తగా బాధ్యతలు చేపట్టే పాలకవర్గాలు పల్లెల్లో అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజల మెప్పు పొందే విధంగా పని చేయాలి.

News December 15, 2025

NLG: సాఫ్ట్‌వేర్‌ TO సర్పంచ్‌

image

సొంతూరుకు సేవచేయాలని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన యువకుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా అనుముల (M)ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎడవల్లి వంశీకృష్ణ విజయం సాధించారు. వంశీకృష్ణ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.

News December 15, 2025

పహల్గాం ఉగ్రదాడి.. నేడు ఎన్ఐఏ ఛార్జ్‌షీట్

image

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై NIA ఇవాళ ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. జమ్మూలోని NIA ప్రత్యేక కోర్టు ముందు ఫైల్ చేయనుందని అధికారులు తెలిపారు. ఈ దాడికి కారుకులైన ముగ్గురు టెర్రరిస్టులను జులైలో భద్రతా దళాలు హతమార్చాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన <<16780359>>ఉగ్రదాడి<<>>లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా పాక్ ఉగ్ర శిబిరాలపై ‘<<16441544>>ఆపరేషన్ సిందూర్<<>>’ను భారత్ చేపట్టిన విషయం తెలిసిందే.