News March 7, 2025

కాకినాడ : చాలా ఘోరం కదా..?

image

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ)చనిపోయాడు.

Similar News

News November 26, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

image

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.

News November 26, 2025

స్వర్ణాంధ్ర @ 2047 దిశగా పురోగతి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @ 2047 సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి శాఖకు చెందిన ప్రగతి సూచికల్లో (KPIs) పురోగతి కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన 563 కీలక ప్రగతి సూచికల్లో మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు.

News November 26, 2025

స్వర్ణాంధ్ర @ 2047 దిశగా పురోగతి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @ 2047 సాధన దిశగా చేస్తున్న ప్రయాణంలో ప్రతి శాఖకు చెందిన ప్రగతి సూచికల్లో (KPIs) పురోగతి కనిపిస్తోందని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన 563 కీలక ప్రగతి సూచికల్లో మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు.