News February 19, 2025

కాకినాడ: జగన్‌ను కలిసిన మాజీ మంత్రి కన్నబాబు

image

కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే,వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం సాయంత్రం పార్టీ అధినేత జగన్‌ను కలిశారు. ఆయనను ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌గా నియమించిన తర్వాత తొలిసారిగా తాడేపల్లి వెళ్లి అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన జగన్‌కు హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ వివాదంపై చర్చించారు.

Similar News

News December 7, 2025

స్కూల్‌పై దాడి.. 43 మంది చిన్నారులు మృతి

image

సుడాన్‌లో ఆర్మీ, రెబల్స్(పారా మిలిటరీ) మధ్య ఆధిపత్య పోరులో వేలాది మంది అమాయకులు చనిపోతున్నారు. తాజాగా ఆర్మీ కంట్రోల్‌లో ఉన్న కలోగిపై రెబల్స్ చేసిన డ్రోన్ దాడిలో 79 మంది మరణించారు. వీరిలో 43 మంది చిన్న పిల్లలు ఉన్నారు. మరో 38 మంది గాయపడ్డారు. రెబల్స్ తొలుత కిండర్‌గార్టెన్(స్కూల్), ఆస్పత్రిపై దాడి చేశారు. పిల్లలను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తుండగా మళ్లీ అటాక్ చేసినట్లు అధికారులు తెలిపారు.

News December 7, 2025

‘ క్రీమీలేయర్’ తీర్పుతో సొంతవర్గం నుంచే విమర్శలు: గవాయ్

image

SC రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలు తీర్పుతో తాను సొంతవర్గాల నుంచే విమర్శలు ఎదుర్కొన్నానని మాజీ CJI గవాయ్ పేర్కొన్నారు. ‘అంబేడ్కర్ దృష్టిలో జీరో దగ్గర ఉన్న వెనుకబడ్డ వ్యక్తికి సైకిల్ ఇవ్వాలి. అప్పుడే అతడు సైకిల్‌పై ముందున్న వారిని చేరుకొని సమానంగా నడుస్తాడు. అంతే తప్ప సైకిల్‌పై ఎప్పటికీ అతడే వెళ్తూ జీరో దగ్గర ఉన్నవారిని అలాగే ఉండాలనరాదు’ అని ముంబై వర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

News December 7, 2025

పార్వతీపురం: ‘అర్జీల స్థాయిని 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుకోవచ్చు’

image

పీజీఆర్‌ఎస్‌లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్‌లో నమోదు చేయవచ్చని పార్వతీపురం కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.