News February 12, 2025
కాకినాడ: జగన్ స్కాములపై విచారణ తప్పనిసరి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ, ఈడి సంస్థలతో విచారణ చేయించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి కేంద్రంగా జరిగిన స్కాముల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇందులో ప్రధానమైందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం జగన్ పై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలన్నారు.
Similar News
News November 2, 2025
సారంగాపూర్: చిన్నారిపై విరుచుకోపడ్డ కుక్కలు

సారంగాపూర్ మండలం బీరవెల్లిలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సయ్యద్ సహాద్(1) పై దాడి చేయడంతో బాబు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ తీసుకెళ్లారు. నిత్యం కుక్కల దాడులు పెరుగుతున్నాయని వాపోయారు.
News November 2, 2025
క్రీడా సంఘాల వివరాలు ఇవ్వండి: DYSO

సిద్దిపేట జిల్లాలోని క్రీడా సంఘాలు తమ వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య కోరారు. రానున్న సీఎం కప్ను దృష్టిలో ఉంచుకుని, క్రీడా సంఘాలు తమ రిజిస్ట్రేషన్ పత్రాలు, కార్యవర్గ సభ్యుల వివరాలను ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా క్రీడా శాఖ కార్యాలయంలో అందజేయాలి. మరింత సమాచారం కోసం 9441925763 నంబర్కు సంప్రదించవచ్చని చెప్పారు.
News November 2, 2025
Viral: వజ్రనేత్రుడిని చూశారా?

బంగారు దంతాలను పెట్టుకునే వారిని చూసుంటారు.. ఈయన కాస్త వెరైటీ! వజ్రపు కన్ను పెట్టుకున్నారు. $2M విలువైన 2 క్యారెట్ల వజ్రాన్ని కృత్రిమ కనుగుడ్డుగా అమర్చుకున్నారు. US అలబామాకు చెందిన స్లేటర్ జోన్స్(23)కు 17 ఏళ్ల వయసులో Toxoplasmosis ఇన్ఫెక్షన్ వల్ల కుడి కన్నులో చూపు మందగించింది. సర్జరీలు చేయించుకున్నా మార్పు రాలేదు. దీంతో స్వయానా ఆభరణాల వ్యాపారైన ఆయన వజ్రంతో కనుగుడ్డును తయారు చేయించుకున్నారు.


