News February 12, 2025

కాకినాడ: జగన్ స్కాములపై విచారణ తప్పనిసరి

image

గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ, ఈడి సంస్థలతో విచారణ చేయించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి కేంద్రంగా జరిగిన స్కాముల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇందులో ప్రధానమైందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం జగన్ పై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలన్నారు.

Similar News

News September 18, 2025

పనులు నాణ్యతతో చేపట్టండి: కలెక్టర్

image

పాణ్యం నుంచి గోరుకల్లు రిజర్వాయర్ వరకు రూ.6.29 కోట్లతో నిర్మించిన రహదారి పనులను కలెక్టర్ జి.రాజకుమారి గురువారం పరిశీలించారు. కొండజుటూరు, గోరుకల్లు, ఎస్.కొట్టాల, దుర్వేసి గ్రామాలను కలుపుతూ 13.125 కి.మీ. పొడవున పూర్తయిన రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, సాగు నీరు, రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ పనుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 18, 2025

ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

image

EPFO <>వెబ్‌సైట్‌లో<<>> పాస్‌బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరాన్ని సంస్థ తగ్గించింది. ఇకపై మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను చెక్ చేసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల సింగిల్ లాగిన్‌తోనే అన్ని వివరాలు చెక్ చేసుకోవచ్చు. అటు ఉద్యోగి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ కూడా పోర్టల్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనుంది.

News September 18, 2025

అనకాపల్లి: గ్యాస్ సబ్సిడీ నగదు జమ కాని వారికి గమనిక

image

గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమకాని లబ్ధిదారులు నేరుగా బ్యాంకు వద్దకు వెళ్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దీపం -2 పథకంలో భాగంగా సబ్సిడీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 805 మంది లబ్ధిదారులకు నగదు జమకాలేదని వారికి డీలర్లు తగిన సమాచారం ఇవ్వాలన్నారు.