News March 5, 2025
కాకినాడ: జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, పత్తిపాడు అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల కోర్టులలో ఇవి నిర్వహిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.
Similar News
News November 18, 2025
మేడ్చల్: ‘కాలుష్యానికి కారణ భూతంగా.. ఈ పరిశ్రమలు..!

మల్లాపూర్, నాచారం, చర్లపల్లి, కీసర, ప్రశాంత్ నగర్, బొల్లారం, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో 60కి పైగా అనుమతులు లేని పరిశ్రమలు నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిశ్రమలు తమ రోజువారీ ఉత్పత్తుల సామర్థ్యం మేరకు వ్యర్థ ద్రవాల శుద్ధి సదుపాయాలు లేకుండానే యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తేలింది. ఇవే కాలుష్యానికి ప్రధాన కారణభూతంగా మారుతున్నాయని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
News November 18, 2025
కర్నూలు ఘోర ప్రమాదం.. మృతులు వీరే..!

కర్నూలు జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. జాతీయ రహదారిపై కేశవ గ్రాండ్ హోటల్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన లక్ష్మీనారాయణ(56), శ్రీనివాసులు(65), రామిరెడ్డి(40)గా పోలీసులు గుర్తించారు. మెకానిక్ షేక్ జిలాని బాషా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 18, 2025
మేడ్చల్: వరి సాగు చేశారా..? ఈ నంబర్లు ఫీడ్ చేసుకోండి

మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వరి సాగు చేసిన రైతులకు అధికారులు సూచన చేశారు. 1967,1800 425 00333 నంబర్లను మీ వద్ద ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు సమయంలో ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చని, HYDలో సివిల్ సప్లై భవన్ నుంచి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల పై సైతం ఫిర్యాదు చేయవచ్చన్నారు.


