News March 5, 2025

కాకినాడ: జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

image

జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, పత్తిపాడు అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల కోర్టులలో ఇవి నిర్వహిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

Similar News

News October 28, 2025

VKB: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సూచనలు

image

భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఇచ్చే సూచనలు. ✓అవసరమైతే మినహా ఇళ్ల నుంచి బయటికి రావద్దు ✓నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నాలు చేయవద్దు ✓సెల్ఫీలు, రిల్స్ కోసం సాహసాలు చేయవద్దు ✓విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు ✓ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, చెరువులు, దగ్గరికి వెళ్లొద్దు ✓ మ్యాన్ హోల్స్ గుంతల పట్ల జాగ్రత్తగా ఉండండి.

News October 28, 2025

మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం: మంత్రి పార్థసారథి

image

తుఫాను సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News October 28, 2025

‘జగిత్యాలకు రూ.62.50 కోట్ల అభివృద్ధి నిధులు’

image

JGTL మున్సిపాలిటీకీ అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMను కలిసి వినతిపత్రం ఇచ్చిన వెంటనే నిధులు ఆమోదించారని చెప్పారు. ఇప్పటికే కరెంట్, డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.20 కోట్లు ప్రతిపాదనలు పంపామని, జగిత్యాల జిల్లా అభివృద్ధిలో TGకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.