News April 15, 2025
కాకినాడ: జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. తుని, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలకు పంపించిన చరవాణి హెచ్చరికల్లో పేర్కొంది.
Similar News
News December 21, 2025
ఆయన ఫెయిలై.. మమ్మల్ని నిందిస్తారేంటి: ఖర్గే

అస్సాం విషయంలో PM మోదీ చేసిన <<18631472>>ఆరోపణలపై<<>> కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. ‘కేంద్రం, అస్సాంలో ఆయన ప్రభుత్వమే ఉంది. ప్రజలను రక్షించడంలో వాళ్లు విఫలమైతే ప్రతిపక్షాలను ఎలా నిందిస్తారు? మేం అక్కడ పాలిస్తున్నామా? ఆయన ఫెయిలై.. ప్రతిపక్షంపై తోస్తారు. వాళ్లే విధ్వంసకారులు. మేం కాదు. టెర్రరిస్టులనో, చొరబాటుదారులనో మేం సపోర్ట్ చేయడం లేదు. ప్రజలను కాపాడటంలో విఫలమై మాపై నిందలు వేస్తున్నారు’ అని మండిపడ్డారు.
News December 21, 2025
డైట్ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించి రాత్రి భోజనం వసతిని పరిశీలించారు. వంట గదికి వెళ్లి రాత్రి భోజనానికి సంబంధించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించారా, సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. కామన్ డైట్ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.
News December 21, 2025
ఇటుకల బట్టీలు వద్ద పిల్లలకు పోలియో చుక్కలు వేసిన Dy DMHO

పలాస మండలం బుడంబో కాలనీ వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలను డిప్యూటీ డీఎంఎంహెచ్ ఓ మేరీ కేథరిన్ వేశారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి చుక్కలు వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. భవిష్యత్తులో పోలియో వ్యాది బారిన పడకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.


