News April 12, 2025
కాకినాడ జిల్లాకు 20వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో కాకినాడ జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 17,326 మంది పరీక్షలు రాయగా 13,582 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 20,398 మందికి 12,920 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో కాకినాడ జిల్లా నిలిచింది.
Similar News
News December 12, 2025
వారికి ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్కు మార్కులు

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.
News December 12, 2025
సంగారెడ్డి: రెండో విడత.. 229 స్థానాలకు 649 మంది పోటీ

సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి. పది మండలాల్లోని 229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా మొత్తం 649 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం తెలిపారు. చెప్పారు. 1,941 వార్డు స్థానాలకు 4,526 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
News December 12, 2025
NGKL: టీబీ నిర్మూలనకు మొబైల్ ఎక్స్రే యూనిట్ ప్రారంభం

జిల్లాలో టీబీ నిర్మూలన కోసం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం కింద శుక్రవారం మొబైల్ ఎక్స్రే యూనిట్ను అధికారులు ప్రారంభించారు. రూ.22 లక్షల విలువైన ఈ ఆధునిక యంత్రాన్ని డాక్టర్ రఫిక్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ ఘన, ఇంజినీర్ సచిన్ పరిచయం చేశారు. గ్రామాల వారీగా నిర్వహించే టీబీ గుర్తింపు శిబిరాలకు ఈ మొబైల్ ఎక్స్రే యూనిట్ను తీసుకెళ్లి అనుమానితులందరికీ పరీక్షలు చేయనున్నారు.


