News January 4, 2025
కాకినాడ జిల్లాలో ఎయిర్పోర్టుపై CM కీలక ప్రకటన
ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో ఇప్పటికే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాకినాడ జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈమేరకు CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అన్నవరం, తుని మధ్య ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ మేరకు ఆ ఏరియాలో 757 ఎకరాలను గుర్తించినట్లు సీఎం నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.
Similar News
News January 14, 2025
తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు
తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.
News January 14, 2025
తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు
తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.
News January 14, 2025
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.