News March 21, 2025

కాకినాడ జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా కాకినాడ, పిఠాపురంలో అప్పుడే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Similar News

News November 14, 2025

GNT: బాధితులలో ఎక్కువ శాతం నగరవాసులే

image

ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం నిర్వహించబడుతుంది. మధుమేహం (షుగర్ వ్యాధి) వ్యాధి మందు ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఫ్రెడరిక్ బాంటింగ్ పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిపిన అధ్యయనాలు ప్రకారం టైప్ 2 డయాబెటిస్ గ్రామీణ ప్రాంతంలో సుమారు 6.5% ఉంటే, నగరవాసులలో 21% కంటే ఎక్కువ ఉన్నట్లు అంచనా. బాధితులలో ఎక్కువ శాతం 25-55 ఏళ్ల వయసు వారే.

News November 14, 2025

అలసంద సాగు..అధిక దిగుబడినిచ్చే విత్తనం ఇదే

image

అలసంద 85 నుంచి 90 రోజుల పంట. దీనికి చల్కా, ఎర్రనేలలు ఈ పంటకు అనుకూలం. అన్ని కాలాల్లో విత్తుటకు టి.పి.టి.సి-29 అనే విత్తన రకం అనుకూలం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి కార్బండజిమ్ 2గ్రా. లేదా థైరమ్ 2 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత విత్తాలి. వరుసకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ విత్తుకోవాలి.

News November 14, 2025

పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ బదిలీ

image

పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గనూరే సూరజ్ ధనుంజయ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి సూరజ్ ప్రస్తుతం పల్నాడు జిల్లా జేసీగా పనిచేస్తున్నారు. ఆయనను బదిలీ చేస్తూ ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.