News March 21, 2025
కాకినాడ జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా కాకినాడ, పిఠాపురంలో అప్పుడే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Similar News
News November 21, 2025
శ్రీవారికి సుప్రభాత సేవ నిర్వహించేది ఇక్కడే..

తిరుమామణి మండపం దాటాక కనిపించే సుందర సన్నిధే బంగారు వాకిలి. ఈ వాకిలికి పూర్తిగా బంగారు రేకుల తాపడం ఉంటుంది. దీనికి ఇరువైపులా శ్రీవారి ద్వారపాలకులు అయిన జయవిజయుల పంచలోహ విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీవారికి రోజూ చేసే తొలి సేవ అయిన సుప్రభాత సేవ ఈ బంగారు వాకిలి దగ్గరే మొదలవుతుంది. అన్నమాచార్యులు తమ కీర్తనల్లో ‘కనకరత్నకవాటకాంతు లిరుగడ గంటి’ అని వర్ణించింది కూడా ఈ దివ్య బంగారు వాకిలినే. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 21, 2025
TG వెదర్ అప్డేట్.. ఈనెల 23 నుంచి వర్షాలు

TG: రాష్ట్రంలో ఈనెల 23 నుంచి 25 వరకు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు పొడి వాతావరణం నెలకొంటుందని, రాబోయే 2 రోజుల్లో పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని వెల్లడించింది. నేడు ADB, JGL, KMR, ASF, MNCL, MDK, NML, NZB, SRCL, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11-15°C ఉంటాయని, మిగతా జిల్లాల్లో >15°Cగా నమోదవుతాయని తెలిపింది.
News November 21, 2025
ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.


