News February 24, 2025
కాకినాడ జిల్లాలో దంచేస్తున్న ఎండలు

కాకినాడ జిల్లాలో ఆదివారం ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పిఠాపురం, కాకినాడ పట్టణాలతోపాటు పరిసర ప్రాంతాల్లో నిన్న ఉదయం నుంచే ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే నెల రాకుండానే ఎండలు దంచేస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రయాణాలు చేసేవారు మంచినీళ్ల బాటిళ్లు వెంట తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 5, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.
News December 5, 2025
KMR: మూడు నెలలుగా వేతనాలు అందట్లేదని DMHOకు వినతి

కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్యకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాకపోవడంతో ఇళ్లల్లో భారం ఏర్పడి, జీవితాలు కొనసాగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతినెల 1వ తేదీన వేతనాలు అందేలా ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు.
News December 5, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలలో మెగా ptm 3.0:ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
➤ జిల్లాలో విద్యుత్ షాక్ ఘటనలో ఇద్దరికీ గాయాలు
➤ నర్సీపట్నంలో అమృత మహిళా క్యాంటీన్ ను ప్రారంభించిన స్పీకర్
➤ నాలుగు కేజీల గంజాయితో తమిళనాడు వాసి అరెస్ట్
➤ పన్ను వసూలు పై నర్సీపట్నం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్
➤ బాధ్యతలు స్వీకరించిన నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవో
➤ వాడ్రాపల్లిలో మధ్యాహ్న భోజనం పై నిలదీసిన పేరెంట్స్


