News February 24, 2025

కాకినాడ జిల్లాలో దంచేస్తున్న ఎండలు

image

కాకినాడ జిల్లాలో ఆదివారం ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పిఠాపురం, కాకినాడ పట్టణాలతోపాటు పరిసర ప్రాంతాల్లో నిన్న ఉదయం నుంచే ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. గరిష్టంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే నెల రాకుండానే ఎండలు దంచేస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రయాణాలు చేసేవారు మంచినీళ్ల బాటిళ్లు వెంట తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News

News January 8, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

▶అక్రమ గ్రావెల్ తవ్వకాలు సహించం: ఎమ్మెల్యే శిరీష
▶ఎల్.ఎన్ పేట: ఎరువులు అందక రైతుల ఆందోళన
▶పలాస: గంజాయితో నలుగురు వ్యక్తులు అరెస్ట్
▶వైసీపీ పార్లమెంట్ కో-ఆర్డినేటర్‌గా తమ్మినేని కొనసాగింపు
▶టెక్కలి: చనిపోయిన పందులతో పరిశ్రమ ఎదుట నిరసన
▶సర్పంచ్‌పై దాడి.. ఎస్పీకి ధర్మాన కృష్ణచైతన్య ఫిర్యాదు
▶మందస: ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వమని ప్రతిజ్ఞ
▶సోంపేట: రెచ్చిపోతున్న కోతుల గుంపులు

News January 8, 2026

రాత్రి పూట ఇవి తినొద్దు: వైద్యులు

image

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆకలి, నిద్రను కంట్రోల్ చేసుకునేందుకు ఏది పడితే అది తింటారు. మసాలా, నూనె పదార్థాలు, చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో మంట, గ్యాస్‌తో పాటు కొవ్వు పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు బాదం, బ్రోకలీ, బెర్రీస్, సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.

News January 7, 2026

సింగరేణి హాకీ పోటీల్లో శ్రీరాంపూర్‌ జట్టు విజయం

image

డబ్ల్యూపీఎస్‌ & జీఏ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి స్థాయి హాకీ పోటీలు ఈ రోజు ముగిశాయి. ఫైనల్స్‌లో శ్రీరాంపూర్‌ జట్టు, మందమర్రి, బెల్లంపల్లి ఏరియా జట్టు తలపడ్డాయి. ఈ పోటీల్లో శ్రీరాంపూర్‌ జట్టు విజయం సాధించింది. ముగింపు వేడుకలకు ఆర్జీ 1 జీఏం డీ.లలిత్‌ కుమార్‌ హాజరై ట్రోఫీ అందజేశారు. శ్రీరాంపూర్‌ జట్టు కోల్‌ ఇండియా పోటీలకు పంపనున్నట్లు తెలిపారు.