News February 15, 2025

కాకినాడ: జిల్లాలో దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

image

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Similar News

News April 13, 2026

కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. 7 ప్రాంతాలు ఎల్లో జోన్ లో ఉండగా మిగతా ప్రాంతాలన్నీ 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎల్పుగొండ, బిచ్కుంద, బొమ్మన్ దేవిపల్లిలో 41.6°C, మాచాపూర్, మేనూర్ 41.5, కొల్లూరు 41.4, పిట్లం 41.3, లింగంపేట, మాక్డూంపూర్, నాగిరెడ్డిపేట 41.2, IDOC(కామారెడ్డి), దోమకొండ 41.1°C నమోదయ్యాయి.

News April 13, 2026

తిరుపతి: వేధించిన అధికారి సరెండర్..!

image

తిరుపతి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయ ఉద్యోగినిని ఏపీసీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉన్న పోస్టు అర్హతను ప్రభుత్వం మార్చింది. దీంతో ఆ ఉద్యోగి డిప్యుటేషన్‌పై ఈ శాఖలోకి వచ్చాడు. అక్కడే పనిచేసస్తున్న ఓ ఉద్యోగిని ఆయనపై వేధింపుల ఆరోపణలు చేయగా.. విచారణలో నిజమని తేలింది. దీంతో ఏపీసీని కలెక్టర్‌‌కు సరెండర్ చేశారు.

News April 13, 2026

భూపాలపల్లి: ఆశగా ఎదురుచూస్తున్న 18వేల మంది యువత..!

image

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులకు తప్ప అమలుకు నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఏడాది గడిచినా అమలుకు శ్రీకారం చుట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి పథకం అమలు చేయాలని యువత కోరుతున్నారు.