News March 7, 2025

కాకినాడ జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. కాకినాడ జిల్లా వాసులు తూ.గో, కోనసీమ జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా కాకినాడ జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News February 8, 2026

పెనమలూరు ప్రొఫెసర్‌కు అంతర్జాతీయ పురస్కారం

image

ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో విశిష్ట సేవలకుగాను పెనమలూరుకు చెందిన డాక్టర్ బి.ఎన్. శ్రీనివాస్‌ ‘గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2025-26’కు ఎంపికయ్యారు. దుబాయ్‌కు చెందిన ఏకేఎస్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. రసాయన శాస్త్రం, కాలుష్య నివారణపై ఆయన చేస్తున్న 30 ఏళ్ల కృషికి ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా తెలప్రోలు కళాశాల యాజమాన్యం, సహచరులు ఆయనను ఘనంగా అభినందించారు.

News February 8, 2026

విశాఖ: పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 969 పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 4తో గత పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. దీంతో ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మార్చి 8 నాటికి జాబితా తయారీ పూర్తి చేసి, 9న ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

News February 8, 2026

SPMCILలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.50వేలు

image

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SPMCIL<<>>) 3 యంగ్ ప్రొఫెషనల్(సైబర్ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com