News March 7, 2025
కాకినాడ జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. కాకినాడ జిల్లా వాసులు తూ.గో, కోనసీమ జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా కాకినాడ జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.
Similar News
News February 8, 2026
పెనమలూరు ప్రొఫెసర్కు అంతర్జాతీయ పురస్కారం

ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో విశిష్ట సేవలకుగాను పెనమలూరుకు చెందిన డాక్టర్ బి.ఎన్. శ్రీనివాస్ ‘గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2025-26’కు ఎంపికయ్యారు. దుబాయ్కు చెందిన ఏకేఎస్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. రసాయన శాస్త్రం, కాలుష్య నివారణపై ఆయన చేస్తున్న 30 ఏళ్ల కృషికి ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా తెలప్రోలు కళాశాల యాజమాన్యం, సహచరులు ఆయనను ఘనంగా అభినందించారు.
News February 8, 2026
విశాఖ: పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 969 పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 4తో గత పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. దీంతో ఓటరు జాబితా సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మార్చి 8 నాటికి జాబితా తయారీ పూర్తి చేసి, 9న ప్రజల పరిశీలన కోసం ప్రదర్శించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
News February 8, 2026
SPMCILలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.50వేలు

సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<


