News March 2, 2025
కాకినాడ జిల్లాలో మద్యం షాపుల మూసివేత

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ సోమవారం జరగనుంది. ఏలూరులో కౌంటింగ్ జరుగుతున్నప్పటికీ కాకినాడ జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు షాపులు మూసివేస్తారు. తిరిగి మంగళవారం షాపులు తెరవాలని ఎక్సైజ్ శాఖ నుంచి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఆదేశాలు వచ్చాయని మద్యం షాపుల యజమానులు వెల్లడించారు. దీంతో జిల్లాలోని 154 మద్యం షాపులు మూతబడనున్నాయి.
Similar News
News November 16, 2025
సిరిసిల్ల: రబీలో లక్ష 94 వేల ఎకరాల్లో పంట సాగుకు అంచనా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రబీ సీజన్ (యాసంగి)లో సుమారు లక్ష 94 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు చేరింది. దీంతో 1,83,000 ఎకరాల్లో వరి సాగుకు, 11 వేల ఎకరాల్లో మొక్కజొన్న, పొద్దు తిరుగుడు తదితర పంటల సాగుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇందుకు గాను 45,312 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేశారు.
News November 16, 2025
మరోసారి ఐపీఎల్కు సిక్కోలు యువకుడు

ఐపీఎల్-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.
News November 16, 2025
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంపీ అరుణకు విశేష స్వాగతం

సౌతాఫ్రికా అధికారిక పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న పాలమూరు ఎంపీ డీకే.అరుణను ఉమ్మడి మహబూబ్నగర్ నాయకులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అందరి ఆదరణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు–2025 JPC సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.


