News February 6, 2025
కాకినాడ జిల్లా ప్రజలకు ముఖ్య సమాచారం
గుండెపోటు వస్తే రూ.45 వేల విలువైన ఇంజెక్షన్ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేస్తారని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ వెల్లడించారు. సంబంధిత వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఇంజెక్షన్ దొరికే ఆసుపత్రుల వివరాలు ఇవే.
➤ తాళ్లరేవు ➤ సామర్లకోట ➤ తుని ➤ పెదపూడి
➤ ప్రత్తిపాడు ➤ ఏలేశ్వరం ➤ పెద్దాపురం
➤జగ్గంపేట ➤ పిఠాపురం ➤ రౌతులపూడి
Similar News
News February 7, 2025
సోనూసూద్ అరెస్ట్కు వారెంట్
నటుడు సోనూసూద్కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.
News February 7, 2025
NGKL: చెరువులో పడి మహిళ మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
News February 7, 2025
నేడు క్యాబినెట్లో కొత్త ఐటీ బిల్లుపై చర్చ, ఆమోదం!
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లు రూపకల్పన పూర్తయినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. దీనిపై ఇవాళ క్యాబినెట్లో చర్చించి ఆమోదించనున్నారని పేర్కొన్నాయి. వారంలో లోక్సభలో ప్రవేశపెడతారని చెప్పాయి. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కొత్త బిల్లుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందరికీ అర్థమయ్యేలా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని వెల్లడించారు.