News April 12, 2025
కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ సస్పెండ్

కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కోవూరి ఆనందరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తునికి చెందిన ఓ గ్యాస్ ఏజెన్సీ ఆస్తి పేరు మార్చడానికి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ గత నెల 28న ఆనందరావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇద్దరిని విచారించి రిజిస్ట్రార్ ఆనందరావును సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News April 25, 2025
విశాఖలో చంద్రమోలి అంతిమ యాత్ర

పహల్గాంలో ఉగ్రమూకల కాల్పుల్లో మరణించిన చంద్రమోలి అంతిమ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. పాండురంగాపురంలో ఆయన పార్థివదేహానికి మంత్రులు అనిత, సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నివాళులు అర్పించి పాడె మోశారు. జ్ఞానాపురం శ్శశాన వాటికలో ఆయన దహన సంస్కణలు పూర్త చేయనున్నారు.
News April 25, 2025
ఉగ్రదాడి వెనుక సూత్రధారి ఇతడే?

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబాకు చెందిన క్రియాశీల శిబిరం ఉందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి వచ్చారని, వీరికి స్థానిక మిలిటెంట్లు సాయంగా నిలిచారని పేర్కొన్నాయి. ఆ ఉగ్ర మాడ్యూల్కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, అతడి డిప్యూటీ సైఫుల్లా సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి వారు దాన్ని ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News April 25, 2025
కాగజ్నగర్ : నేడు, రేపు పలు రైళ్లు రద్దు

మూడోలైన్ నిర్మాణ పనుల్లో భాగంగా కాగజ్నగర్కు రానున్న పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కాగజ్ నగర్- ఆసిఫాబాద్ రైలు మార్గంలో మూడవ లైను నిర్మాణ పనులు చేపడుతున్నందున 25, 26 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. BPQ-KZJ ఎక్స్ప్రెస్, పుష్ పుల్, కాఘజ్నగర్, భాగ్యనగర్, ఇంటర్సిటీ, సింగరేణి రైలు బెల్లంపల్లి వరకు నడవనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.