News April 11, 2025
కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.
News November 17, 2025
సౌదీ యాక్సిడెంట్.. ఆ ఇంట్లో అనాథగా మిగిలిన సిరాజ్

సౌదీలో జరిగిన యాక్సిడెంట్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. రాంనగర్ వాసి నసీరుద్దీన్ తన ఫ్యామిలీతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. దురదృష్టవశాత్తు వెళ్లిన 18 మంది బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన కుమారుడు సిరాజ్ ఉద్దీన్ అనాథగా మిగిలాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కుమారుడు నిత్యం ఫ్యామిలీతో ఫోన్ కాల్స్ మాట్లాడేవాడని తెలిసింది. ప్రమాదం తెలుసుకున్న అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు.
News November 17, 2025
ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పుట్టకోట మహిళలు కోరిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఆర్డీఓ, హౌసింగ్ అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముదిగొండ వల్లభి యువత కోరిన విధంగా గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని సూచించారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


