News April 11, 2025
కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News October 16, 2025
బిగ్బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

TG: బిగ్బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
News October 16, 2025
కరీంనగర్ గిన్నప్ప రుచి వేరు..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో వంటకాలు ఉన్నప్పటికీ సర్వపిండి(గిన్నప్ప) చాలా స్పెషల్. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిపై చేసిన సర్వపిండి తింటే ఆ రుచి ఎప్పటికీ మరువరు. ఇది ప్రస్తుతం నగరాల్లోకి వ్యాపించింది. కర్రీ పాయింట్లలో రూ.10-20 చొప్పున ఒక సర్వపిండి విక్రయిస్తున్నారు. ఈ జనరేషన్తో పోలిస్తే 90’sలో స్కూల్కు వెళ్లొచ్చేలోపు ఇంటి వద్ద అమ్మ చేసిన సర్వపిండి రెడీగా ఉండేది. నేడు ప్రపంచ భోజన దినోత్సవం.
News October 16, 2025
ముగ్గుర్నీ చూస్తుంటే కనులపండువే: పయ్యావుల

AP: కూటమికి వేసిన ఒక్క ఓటు వంద లాభాలను తెచ్చిందని కర్నూలు GST సభలో మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ‘నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ను చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇవాళ కనులపండువగా ఉంది. టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మనవైపు తిప్పేలా చేసిన నాయకత్వం మోదీది. భవిష్యత్తు తరాల తలరాతలు మార్చే నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.