News February 13, 2025

కాకినాడ: జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజా

image

మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. జిల్లాకు చెందిన ఇద్దరి కాపు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించింది. 

Similar News

News December 6, 2025

కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలపై విమర్శలు

image

రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన <<18486026>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీస్తున్నాయి. రూపాయి తన స్థాయిని కనుగొనడం అంటే డాలర్‌కు 100 రూపాయలు దాటడమా అని సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేసి, అధికారంలో ఉన్నప్పుడు సమస్యను చిన్నదిగా చూపడం సరికాదని దుయ్యబడుతున్నారు. ఏమైనప్పటికీ చివరికి ధరలు పెంచి సామాన్యుడినే దోచుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు?

News December 6, 2025

SRCL: పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు రవికుమార్ శనివారం పరిశీలించారు. వేములవాడ అర్బన్ పరిధిలోని చీర్లవంచ, మారుపాక, చింతలతాన, కోనరావుపేట మండలం కొలనూరు, మర్తనపేటలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

News December 6, 2025

చాట్ జీపీటీతో వ్యవసాయ రంగానికి కలిగే మేలు

image

సాంకేతిక రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లిన ‘చాట్ జీపీటీ’తో వ్యవసాయానికీ మేలే అంటున్నారు నిపుణులు. సాగులో నీళ్లు, ఎరువులు, పురుగు మందులను ఎంతమేర వాడాలి, పంట దిగుబడి పెరగడానికి అవసరమైన సూచనలను ఇది ఇవ్వగలదు. వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను విశ్లేషించి.. పంట దిగుబడికి అవసరమైన సూచనలతో పాటు పంట నష్టం తగ్గించే సూచనలను ఇది అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.