News February 22, 2025
కాకినాడ జిల్లా TODAY TOP NEWS

➤పిఠాపురం మాజీ ఎమ్మెల్యేతో ఎంపీ శ్రీనివాస్ భేటీ
➤సామర్లకోట: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆటో
➤పిఠాపురం: పవన్ పాల్గొనే సభా స్థలం పరిశీలన
➤సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
➤తుని: లోవ క్షేత్రానికి అంతర్జాతీయ గుర్తింపు
➤సామర్లకోటలో సినిమా షూటింగ్
➤తునిలో దారుణం.. చిన్నారిపై అత్యాచారయత్నం
➤భక్తజన సంద్రంగా తొలి తిరుపతి
➤కాకినాడ: నేరాలపై ఎస్పీ నెలవారీ సమీక్ష
Similar News
News December 7, 2025
HNK: రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా?

హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో క్యూఆర్ కోడ్ ద్వారా పెట్టుబడి పేరుతో పంపిన డబ్బు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఈ నెల 3న పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు పెద్దమొత్తంలో ఉండటంతో నేషనల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.
News December 7, 2025
మునగాకు కషాయంతో బోలెడు ప్రయోజనాలు!

మునగాకు కషాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫ్రెష్ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి మరిగించాలి. అవి మెత్తబడ్డాక వడకట్టి తాగాలి. మునగాకులను ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా కషాయం చేసుకోవచ్చు. రోజూ పరగడుపున ఒక గ్లాసు ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, BP, కొవ్వు, జీర్ణ సమస్యల్ని నియంత్రిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి’ అని చెబుతున్నారు.
News December 7, 2025
కరీంనగర్: పల్లెపోరులో స్థాయికి మించిన వాగ్దానాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు స్థాయికి మించిన హామీ పత్రాలను పంచుతున్నారు. స్థానిక పన్నులు, కేంద్ర నిధులకు పరిమితమైన పంచాయతీకి భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఇవి ఎలా నెరవేరుతాయోనని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆచరణ సాధ్యతపై అనుమానాలు ఉన్నా, గెలుపు కోసం అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.


