News February 23, 2025
కాకినాడ జిల్లా TODAY TOP NEWS

➤తునిలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా?
➤పెద్దాపురంలో బంగారం, వెండి చోరీ
➤కాకినాడ: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
➤దుబాయిలో మంత్రితో సానా సతీష్
➤కుంభమేళాలో జగ్గంపేట ఎమ్మెల్యే కుటుంబం
➤తునిలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ ప్రజలు
➤గండేపల్లి: గ్రూప్-2 పరీక్షకు 1590 మంది గైర్హాజరు
➤పెదపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
➤కిర్లంపూడి: ముద్రగడను కలిసిన దాడిశెట్టి రాజా
Similar News
News September 13, 2025
15న యథాతథిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15న సోమవారం యథాతథిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్కు లేదా meekosam.ap.gov.in తెలియజేయాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రం పీజీఆర్ఎస్లో అందజేయాలన్నారు.
News September 13, 2025
9 నెలల్లోపే ఆ స్థానాలకు ఉపఎన్నికలు: KTR

TG: తాము అధికారంలో ఉన్న సమయంలో గద్వాలను జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని KTR అన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 22 నెలలు గడిచినా ఏమీ చేయలేదని మండిపడ్డారు. BRSలోనే ఉన్నానని చెబుతున్న గద్వాల MLA కృష్ణమోహన్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 9 నెలల్లోపే ఫిరాయింపు స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని గద్వాల సభలో అన్నారు.
News September 13, 2025
15న తిరుపతికి రానున్న మారిషస్ PM

మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రాంగుళం ఈనెల 15న తిరుపతికి రానున్నారు. తిరుపతి సమీపంలోని రామాపురం బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.