News March 23, 2025

కాకినాడ జీజీహెచ్‌ను వదలని జీబీఎస్ కేసులు

image

కాకినాడ ప్రభుత్వాసుపత్రిని జీబీఎస్ కేసులు వదలడం లేదు. ఇప్పటివరకు 9మందికి పైగా గిలియన్ బారే సిండ్రోమ్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. శనివారం ఇద్దరు పేషెంట్లు కొత్తగా చేరారు. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి తెలిపారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు బలహీనత తదితర అంశాలతో బాధపడేవారు జీజీహెచ్‌కు రావాలని ఆమె సూచించారు.

Similar News

News January 3, 2026

సాంకేతిక యుగంలో వాస్తు ప్రాశస్త్యం

image

ఈ సాంకేతిక యుగంలో మానవ మనుగడకు ప్రకృతితో ఉన్న సంబంధాన్ని విస్మరించకూడదని, ఆ ప్రకృతితో సంబంధమున్న వాస్తుని కూడా నిర్లక్ష్యం చేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ప్రకృతిలోని సహజ వనరులైన గాలి, వెలుతురును అనుకూలంగా మలుచుకోవడమే వాస్తుశాస్త్ర పరమార్థం. కాలానికి అనుగుణంగా ఆనాటి పద్ధతులను ఫాలో అవ్వకున్నా సుఖమయ జీవనం కోసం వాస్తు సూత్రాలు నిర్లక్ష్యం చేయకూడదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 3, 2026

గద్వాల: ‘ఫార్మర్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలి’

image

రైతుల భూములు, పంటలు ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసి యూనిక్ ఐడి ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని గద్వాల కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి సూచించారు. శనివారం ఐడీఓసీ మందిరంలో విలేజ్ లెవెల్ ఎంటర్ ప్లీనర్లకు ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు సులభంగా అందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఉపయోగపడుతుందని వివరించారు.

News January 3, 2026

ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు కలెక్టర్ సన్మానం

image

గద్వాల జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేసి ప్రతిభ కనబరిచిన 15 మంది ఉత్తమ మహిళ ఉపాధ్యాయులను కలెక్టర్ సంతోష్ శనివారం శాలువ, పూలమాలతో సన్మానించారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 15 మంది టీచర్లకు పురస్కారాలు అందజేశారు. మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి విశేష కృషి చేశారని చెప్పారు. డీఈవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత పాల్గొన్నారు.