News March 23, 2025
కాకినాడ జీజీహెచ్ను వదలని జీబీఎస్ కేసులు

కాకినాడ ప్రభుత్వాసుపత్రిని జీబీఎస్ కేసులు వదలడం లేదు. ఇప్పటివరకు 9మందికి పైగా గిలియన్ బారే సిండ్రోమ్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. శనివారం ఇద్దరు పేషెంట్లు కొత్తగా చేరారు. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి తెలిపారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు బలహీనత తదితర అంశాలతో బాధపడేవారు జీజీహెచ్కు రావాలని ఆమె సూచించారు.
Similar News
News July 9, 2025
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. Sensex 46 పాయింట్ల లాభంతో 83,665 పాయింట్ల వద్ద,, Nifty 10 పాయింట్ల నష్టంతో 25,512 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, JSW స్టీల్, ICICI, HDFC, టెక్ మహీంద్రా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో షేర్లు నష్టాల్లో, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, మారుతీ సుజుకీ, M&M, సిప్లా, రిలయన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
News July 9, 2025
హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు: ఎస్పీ

మందస పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైన హత్యాయత్నం, గృహహింస కేసులో నిందితుడికి 4 ఏళ్లు జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మందసకు చెందిన సూర్యారావు తన భార్య నిర్మలపై హత్యాయత్నం చేశాడు. నేరం రుజువైనందున అసిస్టెంట్ సెషన్ సోంపేట కోర్టు జడ్జి శిక్ష ఖరారు చేసినట్లు వివరించారు.
News July 9, 2025
JGTL: రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన యువతి

ICET-2025 ఫలితాల్లో మొత్తం 58,985 మంది ఉత్తీర్ణత సాధించగా మేడిపల్లి(M) కొండాపూర్(V)కి చెందిన వీరేశం, విజయలక్ష్మి కుమార్తె వైష్ణవి(22) రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. టాప్10లో ఇద్దరే అమ్మాయిలు ఉండగా అందులో మన మండలవాసి వైష్ణవి 5వ ర్యాంకు కొట్టింది. కాగా, ఈమె గతంలో <<16285740>>5బ్యాంకు ఉద్యోగాలు<<>> సాధించి అందరితో శెభాష్ అనిపించుకుంది. వైష్ణవి విజయాల పట్ల పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు.