News April 11, 2025

కాకినాడ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

image

కాకినాడ జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.

Similar News

News November 28, 2025

సిద్దిపేట: జిల్లాలో తొలి సర్పంచ్ ఏకగ్రీవం !

image

పంచాయతీ ఎన్నికల నామినేషన్ తొలిరోజే జగదేవ్‌పూర్ మండలం, బిజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. చెక్కల పరమేశ్వర్ పోటీ లేకుండానే సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి పరమేశ్వర్ నాయకత్వమే సరైనదని నమ్మిన గ్రామస్థులు, ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

News November 28, 2025

ఖమ్మంలో JOBS.. APPLY

image

ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ హైస్కూల్‌లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ఛైర్‌పర్సన్ నిష్ణా శర్మ తెలిపారు. ప్రైమరీ టీచర్ పోస్టుకు డీఈడీ/బీఈడీ, మ్యూజిక్ టీచర్ పోస్టుకు వాయిద్య పరిజ్ఞానం తెలిసి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను kpmhskmm@gmail.comకు పంపవచ్చు లేదా 94405 25093 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.
SHARE IT

News November 28, 2025

తాటిపర్తి: పుట్టిన రోజు వేడుకలో గొడవ.. వ్యక్తి మృతి

image

తాటిపర్తిలో గురువారం రాత్రి జరిగిన వాగ్వాదం విషాదంగా మారింది. శ్రీమంతుల దయ మనుమరాలు పుట్టినరోజు వేడుకల్లో రోడ్డుపై పెట్టిన బల్లను కృష్ణవేణి అనే మహిళ అటుగా వెళ్తూ బల్లలకు తగలడంతో బల్ల పడిపోయింది. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఈ వాగ్వాదం జరుగుతుండగా వెంపల సూరి బాబు (59) ఆకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ ఘటనపై గొల్లప్రోలు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.