News April 11, 2025
కాకినాడ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

కాకినాడ జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.
Similar News
News December 20, 2025
నంద్యాల: ALL THE BEST హసీనా, అంకిత

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలో నంద్యాల జిల్లా క్రీడాకారులు హసీనా, అంకిత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కోచింగ్కు ఎంపికయ్యారు. శిక్షణలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తారని స్పాన్సర్ వసుంధర దేవి తెలిపారు. నంద్యాల జిల్లా నుంచి వీరిద్దరే ఎంపిక కావడం గొప్ప విషయం అన్నారు. చదువులో రాణిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చూపడం హర్షణీయమన్నారు.
News December 20, 2025
సిద్దిపేట: స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి నాగరాజమ్మ తెలిపారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జెర్మనీ, జపాన్, సింగపూర్, న్యూజీలాండ్ దేశాలలోని యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన వారు అర్హులన్నారు. www.telanganaepass.cgg.gov.inలో 01-19-2026 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News December 20, 2025
నెరడిగొండ: 21 ఏళ్లకే ఉప సర్పంచ్గా..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెరడిగొండ మండలం బుద్దికొండకు చెందిన 21 ఏళ్ల యువకుడు సాబ్లే రతన్ సింగ్ను గ్రామ ఉపసర్పంచ్గా ఎన్నుకున్నారు. అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి రతన్ సింగ్ రికార్డు సృష్టించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు.


