News April 11, 2025
కాకినాడ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

కాకినాడ జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.
Similar News
News December 10, 2025
అమరావతికి రానున్న జాతీయ ఫోరెన్సిక్ వర్సిటీ

ఉగాండా హత్యకేసులో హంతకుడిని DNAతో పట్టించిన అదే NFSEU త్వరలో అమరావతిలో నెలకొననుంది. హత్యాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను, సీసీ టీవీ పుటేజీలను శాస్త్రీయంగా విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన వర్సిటీ ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశంలో ఉగ్రవాద కేసుల దర్యాప్తుల్లోనూ ఈ వర్సిటీ కీలక పాత్ర పోషించింది. అమరావతిలో శాఖ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు CM చంద్రబాబుకు ఇచ్చినట్లు వీసీ తెలిపారు
News December 10, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.870 పెరిగి రూ.1,30,310కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.800 ఎగబాకి రూ.1,19,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.8,000 పెరిగి రూ.2,07,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 10, 2025
ఏలూరు: కన్నకొడుకే మోసం చేశాడు..!

ముదినేపల్లి మండలం వణుదుర్రు శివారు కొత్తపల్లికి చెందిన డి.కోటేశ్వరమ్మ మంగళవారం మంగళగిరి జనసేన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో అర్జీ అందించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన 3 సెంట్ల స్థలంలో నిర్మించుకున్న ఇంటికి తన చిన్న కుమారుడు దొంగపట్టా సృష్టించి ఆక్రమించుకుని మోసం చేశాడని ఆరోపించింది. ఇల్లులేక అంగన్వాడీ కేంద్రం అరుగు మీద ఆశ్రమం పొందుతున్నానని ఫిర్యాదులో పేర్కొంది.


