News December 16, 2024

కాకినాడ: నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్

image

కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News January 15, 2025

గోసాల ప్రసాద్ మృతి

image

ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున కాకినాడలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. 

News January 15, 2025

తూ.గో: పందేలలో పచ్చకాకిదే హవా

image

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం శాస్త్రాలు, ముహూర్తాలు ఉంటాయని పందెం రాయుళ్లు చెబుతున్నారు. ఈ మేరకు కుక్కుట శాస్త్రం ప్రకారం మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు తెలుస్తోంది.

News January 14, 2025

తూ.గో : ఒక్క రోజులో రూ. 28.40 కోట్లకు తాగేశారు

image

తూ.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సమరానికి సై అంటూ పౌరుషం చూపుతున్న పుంజులు , మరో వైపు కాయ్ రాజా కాయ్ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పందెం రాయుళ్లతో మన గోదావరి జిల్లా ఉత్కంఠ భరితంగా మారింది. అయితే ఇంత బిజీ నడుమ మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేదాడి కన్నా ఈ ఏడాది రెట్టింపుగా భోగి రోజే రూ. 28.40 కోట్లకు మద్యం తాగేసినట్లు సమాచారం.