News March 24, 2025
కాకినాడ: పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి

పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 27న ఉపసర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మండల ఈవోపీఆర్డీ ఆయా గ్రామ ఉపసర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా విధులు నిర్వహిస్తారు. కాకినాడ జిల్లాలో పెదపాడు మండలం రామేశ్వరం, తుని పరిధిలో దొండవాక, సామర్లకోట మండలం బి.వేమవరం, తొండంగి మండలం పైడికొండ, ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి పంచాయతీల పరిధిలో ఉపసర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి.
Similar News
News October 29, 2025
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News October 29, 2025
తుఫాన్ ప్రభావంతో పెద్దపల్లి పత్తి మార్కెట్ బంద్

తుఫాన్ కారణంగా అకాల వర్షాలు కురుస్తుండటంతో పత్తి తూకం, లోడింగ్ పనుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ కారణంగా యార్డు గురువారం నుంచి శుక్రవారం వరకు మూతపడి ఉంటుందని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సోమవారం నుంచి పత్తి కొనుగోళ్ల కార్యకలాపాలు పునః ప్రారంభం అవుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు.
News October 29, 2025
పన్ను వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి: కలెక్టర్

పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై అధికారులతో కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించి NOV 1-7 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధం విధించాలని కోరారు. చెత్తసేకరణ, నీటినిల్వ నివారణ, పన్ను వసూళ్లు, తాగునీటి సరఫరాపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనుమతిలేని నిర్మాణాలపై చర్యలుంటాయని అన్నారు.


